ETV Bharat / state

Revanthreddy on TSPSC Board : టీఎస్​పీఎస్సీ బోర్డు.. రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది : రేవంత్​రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2023, 7:02 PM IST

Etv Bharat
Etv Bharat

Revanthreddy fires on TSPSC Board : రాజకీయాల్లో పదవులు ఇవ్వలేని వారికి.. టీఎస్​పీఎస్సీ బోర్డులో సభ్యులుగా నియమించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. బోర్డులో గుమస్తా స్థాయిలేని వారు.. గ్రూప్-1 పరీక్ష ఎలా నిర్వహిస్తారని ఎద్దేవా చేశారు.

Revanthreddy at Round Table Meeting on TSPSC : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నియామకాల్లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్‌పార్టీ ఉద్యమిస్తూనే ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్​పీఎస్సీని.. ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకుందని ఆరోపించారు. సోమాజిగూడా ప్రెస్‌క్లబ్‌లో జరిగిన టీఎస్​పీఎస్సీ ప్రక్షాళనపై.. నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

Revanth Reddy VS KTR Tweet War : మీ కల్వకుంట్ల స్కామ్‌ల గురించీ చెప్పండి.. కేటీఆర్​కు రేవంత్ రెడ్డి కౌంటర్

Revanthreddy fires on BRS : రాజకీయాల్లో పదవులు ఇవ్వలేని వారికి బోర్డు సభ్యులుగా నియమించారని, గుమస్తా స్థాయిలేని వారు గ్రూప్-1 పరీక్ష ఎలా నిర్వహిస్తారని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. పేపర్ లీకేజీ జరిగినప్పుడే టీఎస్​పీఎస్సీ బోర్డును రద్దు చేసి అర్హులను నియమించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆరోపించారు. నియామకాలు చేపట్టాల్సిన బోర్డులోనే.. శాశ్వత నియామకాలు లేవన్న ఆయన ఈ నిర్లక్ష్యానికి కారణం సీఎం కేసీఆర్ కాదా? అని నిలదీశారు.

బోర్డు వైఫల్యాలపై, అవకతవకలపై ఐటీ మంత్రి అని చెప్పుకుంటున్న మంత్రి తారక రామారావు ఏం సమాధానం చెబుతారని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. తండ్రికి కాళేశ్వరం.. కుమారుడికి టీఎస్​పీఎస్సీ.. కవితకు సింగరేణి ఏటీఎంలుగా మారాయని ధ్వజమెత్తారు. టీఎస్​పీఎస్సీ అవకతవకల మూలాలు సీఎంవో అధికారులేనని ఆరోపించిన రేవంత్​రెడ్డి.. గ్రూప్ 1 లీకేజీ కేసులో రాజశేఖర్​రెడ్డి, లింగారెడ్డిలను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.

Round Table Meeting on TSPSC Paper Leakage : పేపర్​ లీకేజి వ్యవహారం బయటకు వచ్చినప్పుడు.. బోర్డును రద్దు చేయకుండా ప్రభుత్వం మొండిగా గ్రూప్-1 పరీక్ష నిర్వహించిందని విమర్శించారు. సరైన విధానంలో పరీక్షలు నిర్వహించకపోవడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని ఆయన వ్యాఖ్యానించారు. తక్షణమే టీఎస్​పీఎస్సీ బోర్డును రద్దు చేయాల్సిన బాధ్యత సీఎం పై లేదా? అని రేవంత్ నిలదీశారు. టీఎస్​పీఎస్సీ పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు సమీక్ష చేయడంలేదని ప్రశ్నించారు.

బీఆర్​ఎస్​ ప్రభుత్వం విద్యార్థి, నిరుద్యోగుల నమ్మకాన్ని కోల్పోయిందన్న రేవంత్‌ రెడ్డి.. ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప, కనీస మానవత్వం లేదని విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చేలాగాటమాడుతుందన్న రేవంత్​రెడ్డి త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్...నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

టీఎస్​పీఎస్సీ రద్దుకు బదులు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కోదండరాం చెప్పినట్లు రహదారుల దిగ్బందానికి కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని రేవంత్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం, బీఎస్పీ నేత ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.

"విద్యార్థులు సంవత్సరాల తరబడి పడిన శ్రమంతా వృథా అయ్యింది. టీఎస్​పీఎస్సీని ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకుంది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నియామకాల్లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్‌పార్టీ ఉద్యమిస్తూనే ఉంటుంది." - రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

Revanthreddy on TSPSC Board టీఎస్​పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది : రేవంత్​రెడ్డి

TSPSC Aspirants Confusion : గ్రూప్-1 చదవాలా.. గ్రూప్-2కు ప్రిపేర్ అవ్వాలా.. అయోమయంలో అభ్యర్థులు

High Court Division Bench on Group 1 exam cancellation : గ్రూప్-1 ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించాల్సిందే.. TSPSC అప్పీలును కొట్టివేసిన హైకోర్టు ధర్మాసనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.