ETV Bharat / state

High Court Division Bench on Group 1 exam cancellation : గ్రూప్-1 ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించాల్సిందే.. TSPSC అప్పీలును కొట్టివేసిన హైకోర్టు ధర్మాసనం

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2023, 1:46 PM IST

Updated : Sep 27, 2023, 4:18 PM IST

High Court Division Bench on Group 1 examination cancellation
Telangana Group 1 exam

13:18 September 27

గ్రూప్‌1 కేసులో సింగిల్‌ జడ్జి తీర్పును సమర్థించిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌

High Court Division Bench on Group 1 exam cancellation : గ్రూప్-1 పరీక్ష రద్దు(Group1 Cancellation) చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) అప్పీలుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు విచారణ చేపట్టి హైకోర్టు(Telangana High Court) డివిజన్ బెంచ్.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు సబబేనని స్పష్టం చేసింది. గ్రూప్‌1 కేసులో సింగిల్‌ జడ్జి తీర్పును సమర్థించిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌.. మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిందేనని కమిషన్​కు ఆదేశాలు జారీ చేసింది.

బయోమెట్రిక్ పెట్టకపోవడానికి తగిన కారణాలను టీఎస్​పీఎస్సీ చూపలేదని హైకోర్టు తెలిపింది. మొదటిసారి బయెమెట్రిక్‌ పెట్టి.. రెండోసారి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. 8 నెలల్లో ఎందుకు నిర్ణయం మారిందని నిలదీసింది. రాజ్యాంగబద్ద సంస్థ ఇష్టానుసారం ఎలా వ్యవహరిస్తుందని అడిగింది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ అప్పీలును కొట్టివేస్తూ సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ.. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

TSPSC Group 1 Prelims Exam Cancelled : గ్రూప్​-1 ప్రిలిమ్స్​ రద్దు చేస్తూ డివిజన్​ ఇచ్చిన తీర్పుపై ఎన్​ఎస్​యూఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్​ స్పందించారు. నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​(TSPSC) భరోసా కల్పించలేదని ఆయన ఆరోపించారు. గ్రూప్​- 1 పరీక్షను టీఎస్​పీఎస్సీ పారదర్శకంగా నిర్వహించలేదని విమర్శించారు. టీఎస్​పీఎస్సీని రద్దు చేసి.. కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రూప్​-1 నిర్వహించాలని కోరారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేంతవరకు కాంగ్రెస్​ పోరాటం సాగిస్తుందని హామీ ఇచ్చారు.

Telangana Group 1 Prelims Exam : మొదటిసారి పేపర్​ లీకేజీతో గ్రూప్​-1 పరీక్ష రద్దు అయిందని.. మళ్లీ రెండోసారి కూడా పారదర్శకంగా నిర్వహించక గందరగోళానికి గురి చేశారని కాంగ్రెస్​ నేత బల్మూరి వెంకట్​ విమర్మించారు. టీఎస్​పీఎస్సీ బోర్డుపై నమ్మకం లేక 50 వేల మంది రెండోసారి పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు. గ్రూప్​-1 ప్రిలిమ్స్​ లో అర్హత సాధించలేదని అభ్యర్థులు ఎవరూ కోర్టును ఆశ్రయించలేదన్నారు. బయోమెట్రిక్​ లేకుండా పరీక్ష నిర్వహించారని.. అయినా టీఎస్​పీఎస్సీ పట్టించుకోలేదని వాపోయారు.

TSPSC Aspirants Confusion : గ్రూప్-1 చదవాలా.. గ్రూప్-2కు ప్రిపేర్ అవ్వాలా.. అయోమయంలో అభ్యర్థులు

కేవలం యూత్​ కాంగ్రెస్​ నాయకుడు నర్సింగ్​ను అభ్యర్థులు అప్రోచ్​ అవ్వడంతోనే.. కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. తమ తరఫున న్యాయవాది గిరిధర్​ రావు పూర్తి ఆధారాలను అందజేశారని.. సింగిల్​ జడ్జ్​ వద్ద వాదనలు వినిపించడంతో ఏకీభవించి పరీక్షను రద్దు చేశారన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్​ మీడియా ముందుకు వచ్చిన మాట్లాడాల్సి ఉన్న.. ఆ పని చేయలేదన్నారు. డివిజన్​ బెంచ్​కు అపీల్​కు వెళ్లారు.. కానీ మూడోసారి గ్రూప్​-1 ప్రిలిమ్స్​ నిర్వహించాలని హైకోర్టు సర్కారుకు ఆదేశించిందన్నారు. ఇప్పటికైనా టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని కోరారు.

Bandi Sanjay On Group1 Exam Cancellation : 'గ్రూప్-1 రాసిన ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలి'

TSPSC Appeal Petition Against Group 1 Prelims Cancellation : అప్పీల్​ పిటిషన్​ వేసేందుకు సిద్ధమవుతోన్న TSPSC.. న్యాయ నిపుణులతో సంప్రదింపులు

Last Updated :Sep 27, 2023, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.