ETV Bharat / state

Revanthreddy Chitchat on CWC Meetings Security : రాష్ట్ర డీజీపీని కలిసిన రేవంత్​రెడ్డి.. కాంగ్రెస్​ సమావేశాలకు భద్రత కల్పించాలని వినతి

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2023, 5:57 PM IST

Updated : Sep 8, 2023, 9:30 PM IST

Congress CWC Meetings in Telangana
Revanthreddy on CWC Meetings Security

Revanthreddy on CWC Meetings Security : హైదరాబాద్​లో కాంగ్రెస్ నిర్వహించబోయే సీడబ్ల్యుసీ సమావేశాలకు, జయభేరి బహిరంగ సభకు భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీ అంజన్‌కుమార్‌ను కోరినట్లు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా తుక్కుగూడలో జయభేరి సభాస్థలి నిర్వహణ అనుమతికి అధికారులు నిరాకరించారు. దేవాదాయశాఖ భూమిలో రాజకీయ సభలకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు.

CWC Meeting Update : గతంలో సిట్టింగ్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోగా.. ఇప్పుడు అందుకు భిన్నంగా సిట్టింగులు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి(Revanthreddy) తెలిపారు. హైదరాబాద్​లో కాంగ్రెస్ నిర్వహించబోయే సీడబ్ల్యుసీ(CWC Meetings) సమావేశాలకు, జయభేరి బహిరంగ సభకు భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీ అంజన్‌కుమార్‌ను కోరినట్లు పేర్కొన్నారు.

Revanth Reddy Fire on BJP : 'బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై కుట్ర చేస్తున్నాయి'

రాజశేఖర్​రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టులు గాంధీభవన్ వచ్చి చర్చలు జరిపారన్న రేవంత్.. ఇప్పుడు తాను పీసీసీ చీఫ్ అయ్యాకే వస్తున్నారన్నారు. ఎన్నికలున్న వేరే రాష్ట్రాల్లో సీడబ్యూసీ సమావేశాలు నిర్వహించకుండా.. తెలంగాణకే అవకాశం ఇచ్చారంటే ఈ రాష్ట్ర కాంగ్రెస్​కి జాతీయ నాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. రెండేళ్లుగా కాంగ్రెస్​ నిర్వహించినటువంటి సభలు.. అధికార పార్టీ కూడా చేయలేకపోయిందన్నారు.

Revanth on Joining's in Congress : రెండు సంవత్సరాలుగా తెలంగాణలో కాంగ్రెస్​పార్టీకి ప్రాధాన్యత పెరుగుతోందన్న రేవంత్​రెడ్డి.. వ్యక్తులకు ప్రాధాన్యత పెరగలేదని స్పష్టం చేశారు. తాను పీసీసీ చీఫ్ అయ్యాక కొట్లాడి తమ నాయకులకు పదవులు తెస్తున్నట్లు చెప్పారు. అనేక మంది జాతీయ నాయకులు తెలంగాణకు క్యూ కట్టారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2021 జూలై వరకు 156 మంది కీలక నాయకులు కాంగ్రెస్​ను వీడారన్నారు. 2021 జూలై నుంచి ఇప్పటి వరకు పార్టీ మారిన వాళ్ళు, కాంగ్రెస్​లోకి వచ్చిన వాళ్ల లెక్క వేస్తె పార్టీకి ఎంత ప్రయోజనం చేకూరిందో తెలుస్తుందన్నారు.

Congress PEC Meeting at Gandhi Bhavan : అతి త్వరలోనే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా.. బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట: రేవంత్​రెడ్డి

Revanthreddy on CWC Meetings Security : తాజాగా తుక్కుగూడలో జయభేరి సభాస్థలి నిర్వహణ అనుమతికి అధికారులు నిరాకరించారు. దేవాదాయశాఖ భూమిలో రాజకీయ సభలకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. పరేడ్​గ్రౌండ్​లో సభ పెట్టుకోవాలని దరఖాస్తు చేసుకుంటే.. దానిని కాంగ్రెస్‌కు ఇవ్వకుండా బీజేపీ(BJP), బీఆర్​ఎస్​ కుట్ర చేశాయని రేవంత్​రెడ్డి ఆరోపించారు.

ఈ సమావేశాలకు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతోపాటు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరుకానున్నందున ప్రాధాన్యం సంతరించుకుంది. సభాస్థలి అనుమతికి అధికారులు నిరాకరించడంతో.. ఉద్దేశపూర్వకంగానే ఆటంకాలు కలిగిస్తున్నారని కాంగ్రెస్​ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Congress CWC Meetings in Telangana : 17వ తేదీన ఇతరత్ర కార్యక్రమాలు ఏర్పాటు చేయకుండా చూడాలన్నారు. అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్‌లు రెండు కూడా విజయభేరి సభకు ఆటంకం కలిగించే ప్రయత్నం సరియైన చర్య కాదని పేర్కొన్నారు. కనీవినీ ఎరుగని విధంగా విజయభేరి సభను నిర్వహించి తీరతామని స్పష్టం చేసిన రేవంత్‌ రెడ్డి చేరికలు, పొత్తుల అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. రేవంత్‌ రెడ్డి చెప్పారు.

Revanth Reddy Reaction on Jamili Elections : జమిలి ఎన్నికల వెనక పెద్ద కుట్ర.. ఇది దేశ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం: రేవంత్​రెడ్డి

Revanth Reddy Letter to CM KCR : 'ఒక్క సంతకంతో రెగ్యులర్ చేస్తామన్న హామీ ఏమైంది?'

Last Updated :Sep 8, 2023, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.