ETV Bharat / state

Revanth Reddy Vs KTR : రాహుల్​పై కేటీఆర్ 'ఎడ్లు-వడ్లు' వ్యాఖ్యలు.. ప్రాస కోసం పాకులాడే వారికేం తెలుసంటూ కాంగ్రెస్​ కౌంటర్

author img

By

Published : Jul 17, 2023, 3:51 PM IST

revanth reddy
revanth reddy

Revanth Reddy Tweet On KTR : ఎడ్లు-వడ్లు అని ప్రాసకోసం పాకులాడే గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అని కేటీఆర్​ను ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ట్విటర్​ వేదికగా రాహుల్​ గాంధీపై కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్​ ఇచ్చారు. అలాగే మరోవైపు పొంగులేటి శ్రీనివాస్​ సైతం రాహుల్​ని అనే ముందు.. కేటీఆర్​కు వ్యవసాయం అంటే ఏం తెలుసో చెప్పాలని డిమాండ్​ చేశారు.

Revanth Reddy Tweet On KTR Comments Rahul Gandhi : వ్యవసాయం గురించి రాహుల్​ గాంధీకి ఏం తెలుసంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ట్విటర్​ వేదికగా తీవ్రంగా స్పందించారు. రాహుల్​ గాంధీ మహిళా కూలీలతో కలిసి నాట్లు వేసిన ఫొటోలను పంచుకున్న రేవంత్​.. కేటీఆర్​ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. వ్యవసాయం అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదు డ్రామా రావు అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

ఎవుసం అంటే.. జూబ్లీహిల్స్​ గెస్ట్​ హౌస్​లో సేద తీరడం కాదని రేవంత్​ రెడ్డి అన్నారు. అలాగే సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదని ట్వీట్​ చేశారు. వ్యవసాయం అంటే మట్టి మనసుల పరిమళమని.. మట్టి మనుషుల ప్రేమ అంటూ ట్విటర్​లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఎడ్లు-వడ్లు అని ప్రాసకోసం పాకులాడే.. గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అంటూ ధ్వజమెత్తారు.

"వ్యవసాయం అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదు డ్రామారావు. ఎవుసం అంటే జూబ్లీహిల్స్ గెస్ట్ హౌజ్​లలో సేద తీరడం కాదు.. సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదు. అది మట్టి మనసుల పరిమళం. మట్టి మనుషుల ప్రేమ. ఎడ్లు-వడ్లు అని ప్రాస కోసం పాకులాడే.. ‘గాడిద’కేం తెలుసు గంధపు చెక్కల వాసన." - ట్విటర్​లో రేవంత్​ రెడ్డి​

  • వ్యవ’సాయం’ అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదు డ్రామారావు..
    ఎవుసం అంటే జూబ్లిహిల్స్ గెస్ట్ హౌజ్ లలో సేద తీరడం కాదు…
    సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదు…

    అది మట్టి మనసుల పరిమళం.
    మట్టి మనుషుల ప్రేమ.
    ఎడ్లు - వడ్లు అని ప్రాసకోసం పాకులాడే … ‘గాడిద’కేం తెలుసు గంధపు చెక్కల వాసన.… pic.twitter.com/wx5hXqy1TX

    — Revanth Reddy (@revanth_anumula) July 17, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాహుల్​ని అనే ముందు కేటీఆర్​కు వ్యవసాయం గురించి తెలుసా? : ఇవే వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్​ ప్రచార కమిటీ సహ ఛైర్మన్​ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి స్పందించారు. రాహుల్​ గాంధీని అనే ముందు.. కేటీఆర్​కు అసలు వ్యవసాయం గురించి ఏం తెలుసో చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. రాహుల్​ గాంధీపై విమర్శలు చేసే స్థాయి మంత్రి కేటీఆర్​కు లేదన్నారు. ఈ వ్యాఖ్యలు అర్ధ రహితమని పొంగులేటి ఖండించారు. ఒకవైపు మీరు వేలు చూపితే.. మిగిన నాలుగు వేళ్లు మీ వైపు చూపుతాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి అంబర్​పేట్​లోని కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంత రావును పొంగులేటి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ ఏ గీత గీస్తే.. దాన్ని శిరసావహిస్తానని స్పష్టం చేశారు.

రాహుల్​ గాంధీపై కేటీఆర్​ చేసిన ఆరోపణలు ఇవే..: ఆదివారం జగిత్యాలలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాహుల్​ గాంధీపై విమర్శలు గుప్పించారు. రాహుల్​ గాంధీకి ఎడ్లు తెలవదు.. వడ్లు తెలవదు.. తెలిసిందల్లా క్లబ్బులు, పబ్బులు మాత్రమేనని​ విమర్శించారు. కాంగ్రెస్​ హయాంలో రైతులను ఆ పార్టీ రాబందుల్లా పీక్కుతిందని మండిపడ్డారు. కేటీఆర్​ మాటలకు నేడు రేవంత్​ రెడ్డి, పొంగులేటి సహా పలువురు కాంగ్రెస్ నేతలు కౌంటర్​ ఇచ్చారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.