ETV Bharat / state

Dalithabandhu: దళితబంధు పైలట్ ప్రాజెక్టు అమలుకు నిధులు విడుదల

author img

By

Published : Oct 18, 2021, 8:46 PM IST

Updated : Oct 18, 2021, 9:18 PM IST

Dalithabandhu: దళితబంధు పైలట్ ప్రాజెక్టు అమలుకు నిధులు విడుదల
Dalithabandhu: దళితబంధు పైలట్ ప్రాజెక్టు అమలుకు నిధులు విడుదల

20:43 October 18

దళితబంధు పైలట్ ప్రాజెక్టు అమలుకు నిధులు విడుదల

  దళితబంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 250 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు కోసం నిధులు విడుదల చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్​కర్నూల్ జిల్లా చారకొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాల్లో పథకం అమలు కోసం నిధులు మంజూరు చేశారు. చింతకానికి మండలానికి వంద కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. మిగతా మూడు మండలాలకు 50 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేసింది. ఈ మేరకు 250 కోట్ల రూపాయలను ఎస్సీ అభివృద్ధిశాఖకు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో దళితబంధు పథకం కోసం 2వేల కోట్లు విడుదల చేసిన సర్కారు.. ఈ 250 కోట్లతో కలిపి మొత్తం 2వేల 250 కోట్ల రూపాయలను విడుదల చేసింది.  

ప్రతిష్ఠాత్మకంగా అమలు

రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి వంద చొప్పున పేద దళిత కుటుంబాలను ఎంపిక చేసి పథకం కింద ఈ ఏడాది ఆర్థికసాయం అందిస్తారు. మిగతా వారికి దశల వారీగా అమలు చేస్తారు. వచ్చే ఏడాది బడ్జెట్​లో దళితబంధు కోసం రూ.30 వేల కోట్లు వరకు కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అఖిలపక్షం, హుజూరాబాద్ దళిత ప్రతినిధులతో ఇప్పటికే సమావేశమై దళితబంధు పథక తీరుతెన్నులు, అమలుపై సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో జీవనోపాధి, వ్యాపారం కోసం కొన్ని యూనిట్లను కూడా సిద్ధం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంత అవసరాలను దృష్టిలో ఉంచుకొని యూనిట్ల జాబితాను సిద్ధం చేశారు. లబ్ధిదారులు వారికి నచ్చిన ఉపాధిమార్గాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మార్గానిర్ధేశం, పర్యవేక్షణ ఉంటుంది. కొంత మంది లబ్ధిదారులు కలిసి ఎక్కువ పెట్టుబడితో పెద్ద యూనిట్ పెట్టుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అండగా దళిత రక్షణ నిధి

దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం, కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే అండగా నిలిచేందుకు వీలుగా దేశంలోనే ప్రప్రథమంగా "దళిత రక్షణ నిధి"ని ఏర్పాటు చేసింది. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల రూపాయల్లో రూ.10 వేలను లబ్ధిదారుని వాటా కింద జమ చేసుకొని దానికి మరో రూ.10 వేలు కలిపి ప్రభుత్వం దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా దళిత రక్షణనిధి నిధి నుంచి వారికి ఆర్థిక మద్దతు ఇచ్చేలా ఏర్పాటు చేయనున్నారు. దళిత బంధు ద్వారా లబ్ధిదారులు పొందుతున్న ఫలితాలను పర్యవేక్షణ కోసం ప్రత్యేక చిప్ అమర్చిన గుర్తింపు కార్డుతో ఫలితాలను పర్యవేక్షిస్తారు. తెలంగాణ దళితబంధు ఒక పథకంగా మాత్రమే కాకుండా, ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలన్న దృఢసంకల్పంతో ముందడుగు వేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఇదీ చదవండి: EC stop Dalithabandhu: ఈసీ కీలక నిర్ణయం.. హుజూరాబాద్​ పరిధిలో దళితబంధు నిలిపివేత

Last Updated :Oct 18, 2021, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.