ETV Bharat / state

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు ప్రారంభం

author img

By

Published : Feb 19, 2021, 7:50 AM IST

తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 వరకు సప్తవాహన సేవలపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
తిరుమలలో కన్నులపండువగా రథసప్తమి వేడుకలు ప్రారంభం
తిరుమలలో కన్నులపండువగా రథసప్తమి వేడుకలు ప్రారంభం

సూర్య జయంతి సందర్భంగా నేడు తిరుమలలో రథసప్తమి వేడుకలు శోభాయమానంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 5.30 నుంచి 8 వరకు సూర్యప్రభ వాహనంపై స్వామి వారు దర్శనమివ్వనున్నారు. ఉదయం 9 నుంచి 10 వరకు చిన్నశేష వాహనంపై.. ఉదయం 9 నుంచి 10 వరకు చిన్నశేష వాహనంపై దర్శనమిస్తారు.

ఉదయం 11 నుంచి 12 వరకు గరుడ వాహనంపై మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు హనుమంత వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు చక్రస్నానం అనంతరం సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనంపై.. సాయంత్రం 6 నుంచి 7 వరకు సర్వభూపాల వాహనంపై.. రాత్రి 8 నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తారు.

ఇదీ చూడండి: రథ సప్తమి విశేషం ఏమిటి? ఏమేం చేయాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.