ETV Bharat / state

'మీలో మీరు బాధపడకండి.. మమ్మల్ని సంప్రదించండి'

author img

By

Published : May 10, 2021, 5:53 PM IST

rachakonda cp mahesh bhagavath, cp on psycho Social Counciling, hyderabad news
rachakonda cp mahesh bhagavath, cp on psycho Social Counciling, hyderabad news

రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో మానసిక సామాజిక సలహా సేవలను రాచకొండ పోలీసులు ప్రారంభించారు. కరోనా కారణంగా ఒంటరితనం, ఒత్తిడి, నిరాశ, భయాలు, దుఃఖం, ఆందోళనతో బాధపడుతున్న వారు తమ నంబర్లను సంప్రదించాలని సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. ఈ సందర్భంగా సైకో సోషల్ కౌన్సిలింగ్ సేవలపై పోస్టర్లను విడుదల చేసి సేవలను ప్రారంభించారు.

'నిశ్శబ్ధంగా బాధపడకండి.. మమ్మల్ని సంప్రదించండి' అని.. రాచకొండ భద్రతా మండలి సైకో సోషల్ కౌన్సెలింగ్ సేవలను ఉపయోగించుకోవాలని ప్రజలను సీపీ మహేశ్​ భగవత్ కోరారు. 04048214800 నంబర్​కు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు, సోమవారం నుంచి శనివారం వరకు ఎవరైనా కాల్ చేయవచ్చని స్పష్టం చేశారు. నేరెడ్​మెట్ రాచకొండ సీపీ కార్యాలయంలో 'సైకో సోషల్ కౌన్సిలింగ్' కౌన్సిలర్లతో సీపీ, జాయింట్ సీపీ సుధీర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కరోనా మహమ్మారి కారణంగా 14 రోజుల పాటు ఒంటరితనం, ఒత్తిడి, నిరాశ, ఒంటరితనం, భయాలు, దుఃఖం, ఆందోళనతో బాధపడుతున్న అనేక సందర్భాలను చూసి.. అందరికీ మానసిక సామాజిక సలహా సేవలను ప్రారంభిస్తున్నామని సీపీ పేర్కొన్నారు.

ఈ సేవలు 2020లో లాక్​డౌన్ సమయంలో అందుబాటులోకి వచ్చాయని.. మొదటి దశలో కౌన్సిలర్లు 200కి పైగా కాల్స్ మాట్లాడారని సీపీ అన్నారు. కరోనా రెండోదశ కారణంగా ఇప్పుడు మళ్లీ కౌన్సిలర్లు తమ సేవలను ప్రారంభించడానికి ముందుకు వచ్చారని తెలిపారు. కొవిడ్​ భయం వల్లే ప్రజలు తమ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని సీపీ అన్నారు.

ఇదీ చూడండి: సరిహద్దులో పోలీసుల ఆంక్షలు.. బాధితుల విజ్ఞప్తులు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.