ETV Bharat / state

ఎన్నికల నిర్వహణకు భారీ బందోబస్తు - రాష్ట్రంలో మొదలైన 144 సెక్షన్

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 9:51 PM IST

Telangana Assembly Elections 2023
Police Security Arrangements for Telangana Elections

Police Security Arrangements for Telangana Elections : ఎన్నికల కోసం పోలీస్‌ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీల ప్రచారంపై దృష్టి కేంద్రీకరించిన పోలీసు ఉన్నతాధికారులు.. గురువారం జరిగే పోలింగ్ శాంతియుత వాతావారణంలో నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. ఈవీఎంలు తరలించే దగ్గరి నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Police Security Arrangements for Telangana Elections : పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు(Polling Centers) చేరుకొని ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 144వ సెక్షన్​ను విధించారు. 28వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి 30వ తేదీ ఉదయం 6గంటల వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈసీ ఆంక్షలు..: ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. 28వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 6గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు మూసేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల కోసం భారీ బందోబస్తు కేటాయించారు.

తొలిసారి ఓటు వేసేందుకు ఉవ్విళ్లూరుతున్న యువతరం

Security Arrangements in Election Duty : ఇందులో 45వేల మంది రాష్ట్ర పోలీసులు(State Police).. 3వేల మంది ఇతర శాఖలకు చెందిన ఖాకీలు, 50 కంపెనీల స్పెషల్ పోలీసులు, 375 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. వీళ్లకు అదనంగా 23500 మంది హోంగార్డులు సైతం ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. కర్నాటక నుంచి 5వేల మంది హోంగార్డులు, మహారాష్ట్ర నుంచి 5వేలు, ఛత్తీస్‌గఢ్ నుంచి 2500, మధ్యప్రదేశ్ 2వేలు, ఒడిషా నుంచి 2వేల మంది హోంగార్డులు విధులు నిర్వహించనున్నారు.

Tight Security in Election Poling Stations : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలను(Central Armed Forces) సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో కేటాయించనున్నారు. కెమెరా మౌంటెడ్ వాహనాలను అక్కడ మొహరించనున్నారు. గస్తీ వాహనాలు సైతం పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో చక్కర్లు కొట్టనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా సమస్య తలెత్తినట్లు తెలియగానే నిమిషాల్లో అక్కడికి చేరుకునే విధంగా క్విక్ రియాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.

Surveillance of Polling Stations : పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న కెమెరాలను కమాండ్ కంట్రోల్ కేంద్రాలకు అనుసంధానం చేశారు. దీని ద్వారా నేరుగా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులకు సలహాలు, సూచనలు(Suggestions) ఇవ్వనున్నారు. ఈవీఎంల తరలింపు సైతం పకడ్బందీగా చేయనున్నారు. ఈవీఎంలు తీసుకెళ్లే వాహనాలకు కేంద్ర సాయుధ బలగాలకు చెందిన పోలీసులు రక్షణగా ఉండనున్నారు.

ప్రతి గల్లీలో తనిఖీలు చేస్తాం - ఎలాంటి ప్రలోభాలను తావివ్వం : రాచకొండ సీపీ చౌహాన్‌

ఇప్పటికే ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాల వద్ద కేంద్ర రక్షణ బలగాలు 24గంటల పాటు పహారా కాస్తున్నాయి. సీసీ కెమెరాలు నలువైపులా బిగించారు. మూడంచెల భద్రత(Three-tier Security) మధ్య ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాలున్నాయి. పోలింగ్ రోజు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లలో పోలింగ్ బూత్ ఎదుట మహిళలు ఒక వరుస, పురుషులు ఒక వరుసలో నిలబడాలని.. అంతకంటే ఎక్కువ వరుసలు ఉండొద్దని పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఇక ఓటర్‌ టైం- శాసనసభ ఎన్నికల్లో అసలైన ఘట్టానికి రంగం సిద్ధం

ఓటర్లందరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏదైనా సమస్య తలెత్తితే డయల్ 100కు ఫిర్యాదు చేయాలని.. లేదా సమీపంలో ఉన్న పోలీసు దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.