ETV Bharat / state

PM Modi Tweet on Turmeric Board Telangana : 'పసుపు రైతుల కోసం మేం ఎంతవరకైనా వెళ్తాం.. ఏమైనా చేస్తాం'

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2023, 12:06 PM IST

PM Narendra Modi Tweet on Turmeric Board
PM Narendra Modi

PM Modi Tweet on Turmeric Board Telangana : పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని మోదీ పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎట్టకేలకు జాతీయ పసుపు బోర్డు ప్రకటనతో పసుపు రైతుల కల నెరవేరినట్లయింది. దశాబ్దాలుగా పసుపు రైతులు చేస్తున్న పోరాటానికి శుభం కార్డు పడింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంపీ ధర్మపురి అర్వింద్.. సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు. అర్వింద్ ట్వీట్​ను ప్రధానమంత్రి మోదీ రీట్వీట్ చేశారు.

PM Modi Tweet on Turmeric Board Telangana : రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు(Telangana Assembly Elections 2023) జరగనుండటంతో.. రాజకీయం వేడెక్కుతోంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ(BJP).. కేసీఆర్​ను ఎలాగైనా ఈసారి గద్దె దించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్(BRS) వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ.. ఓటర్లను ఆకర్షించేందుకు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు చేస్తోంది. ఇందులో భాగంగానే పాలమూరు జిల్లాలో ప్రజాగర్జన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.

  • మన రైతుల శ్రేయస్సు,సౌభాగ్యాలే ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత. జాతీయ పసుపు బోర్డు‌ను ఏర్పాటు చేయడం ద్వారా, మన పసుపు రైతుల సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోవడం, వారికి తగిన మద్దతును అందించడమే మా లక్ష్యం. ముఖ్యంగా దీనిద్వారా నిజామాబాద్‌కు అందే ప్రయోజనాలు అపారం.

    మన పసుపు రైతులకు… https://t.co/xYazlleO07

    — Narendra Modi (@narendramodi) October 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

PM Modi at Palamuru Meeting 2023 : పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాన మంత్రి మోదీ.. పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరాలు కురిపించారు. ఎట్టకేలకు జాతీయ పసుపు బోర్డు(Turmeric Board) ప్రకటనతో పసుపు రైతుల కల నెరవేరినట్లయింది. దశాబ్దాలుగా పసుపు రైతులు చేస్తున్న పోరాటానికి శుభం కార్డు పడింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంపీ ధర్మపురి అర్వింద్.. సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు. అర్వింద్ ట్వీట్​ను మోదీ రీట్వీట్ చేశారు.

PM Modi on Turmeric Farmers : 'మన రైతుల శ్రేయస్సు, సౌభాగ్యాలే ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత. జాతీయ పసుపు బోర్డు‌ను ఏర్పాటు చేయడం ద్వారా మన పసుపు రైతుల సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోవడం, వారికి తగిన మద్దతును అందించడమే మా లక్ష్యం. ముఖ్యంగా దీనిద్వారా నిజామాబాద్‌కు అందే ప్రయోజనాలు అపారం. మన పసుపు రైతులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు మేము ఎంతవరకైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం.' అని ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్​(ట్విటర్)లో ఎంపీ అర్వింద్ పోస్టును రీపోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు.

'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని

MP Arvind Tweet on Turmeric Board Telangana : ఇంతకీ ఎంపీ అర్వింద్(MP Dharmapuri Arvind) ఏమన్నారంటే.. రాష్ట్రంలోని నిజామాబాద్‌లో రైతుల జీవితాలను ఉద్ధరించడానికి బీజేపీ కట్టుబడి ఉందనడానికి జాతీయ పసుపు బోర్డు ప్రకటనే నిదర్శనమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Dharmapuri Arvind) అన్నారు. ఈ చర్య పసుపు సాగులో విప్లవాత్మక మార్పులు చేస్తోందని తెలిపారు. సరసమైన ధరలు, ప్రపంచ గుర్తింపును భరోసాగా నిలుస్తోందని అర్వింద్ తన ట్వీట్​లో పేర్కొన్నారు.

"పసుపు కేవలం ఒక పంట కాదు.. ఇది మన సంస్కృతిలో అంతర్భాగం, ఆరోగ్యం, మతపరమైన ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగిస్తారు. పసుపు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాల కోసం మహమ్మారి సమయంలో దీని డిమాండ్ పెరిగింది. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన పసుపు బోర్డు రైతుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తుంది. ఇక నుంచి పసుపు సాగు రైతులకు, వినియోగదారులకు మద్దతు లభిస్తుంది. పసుపు బోర్డు.. విత్తడం నుంచి పంట వరకు, మార్కెటింగ్ నుంచి ఎగుమతి వరకు, రైతులకు గేమ్ ఛేంజర్. ఈ బోర్డు వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందజేస్తుంది. రాబోయే తరాలకు వ్యవసాయ వారసత్వాన్ని భద్రపరుస్తోంది" అంటూ అర్వింద్ ట్వీట్ చేశారు.

MP Arvind on Turmeric Board : ఇలాంటి చారిత్రక చర్యకు శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్రమోదీకి ఎంపీ అర్వింద్ కృతజ్ఞతలు తెలిపారు. రైతుల పట్ల ఆయనకున్న దృక్పథం, అంకితభావం తరతరాలకు గుర్తిండిపోతాయని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగానికి జాతీయ పసుపు బోర్డు ఆశాజ్యోతి అని అన్నారు. పసుపు బోర్డు ప్రకటనతో తెలంగాణ ప్రజల ఎంతగానో సంతోషిస్తున్నారని అర్వింద్ తెలిపారు.

PM Modi Palamuru Praja Garjana Public Meeting : 'తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రాబోయేది చెప్పింది చేసే ప్రభుత్వం'

Farmers Celebrations Over Turmeric Board Telangana : దశాబ్దాల కల నెరవేరిన వేళ.. పసుపు బోర్డు ప్రకటనతో రైతుల సంబురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.