ETV Bharat / state

Numaish Exhibition : భాగ్యనగర వాసులకు గుడ్​న్యూస్​.. రేపటి నుంచే నుమాయిష్​

author img

By

Published : Feb 24, 2022, 7:51 PM IST

Updated : Feb 24, 2022, 7:58 PM IST

Numaish Exhibition : హైదరాబాద్​ నాంపల్లి మైదానంలో రేపటి నుంచి నుమాయిష్​ ఎగ్జిబిషన్​ పునప్రారంభం కానుంది. జనవరి 1న ప్రారంభమైన పారిశ్రామిక ప్రదర్శన కొవిడ్​ ఉద్ధృతి వల్ల నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొవిడ్​ మహమ్మారి అదుపులోకి రావడంతో రేపటి నుంచి ప్రదర్శన ప్రారంభిస్తున్నట్లు సొసైటీ వర్గాలు తెలిపాయి.

Numaish Exhibition
Numaish Exhibition

Numaish Exhibition : కొవిడ్ ఉద్ధృతితో అర్ధాంతరంగా ఆగిపోయిన 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన- నుమాయిష్​... రేపటి నుంచి (శుక్రవారం) పున ప్రారంభం కానుంది. హైదరాబాద్ నాంపల్లి మైదానంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్.. 45 రోజుల పాటు కొనసాగాల్సి ఉండగా ఒమిక్రాన్ ఉద్ధృతితో నిలిపివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆదేశించింది.

అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గిపోవటం, పరిస్థితులు అదుపులోకి రావటంతో.. ఈనెల 25 నుంచి నుమాయిష్​ను తిరిగి నిర్వహించాలని ఎగ్జిబిషన్ సొసైటీ నిర్ణయించింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని సొసైటీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 25 నుంచి 46 రోజుల పాటు పారిశ్రామిక ప్రదర్శన కొనసాగనుంది. ఇప్పటికే ఎగ్జిబిషన్‌ సొసైటీ ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపుగా 1,400 స్లాళ్లు ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. ఎట్టకేలకు నుమాయిష్ తిరిగి ప్రారంభం అవుతుండటంతో ఇటు హైదరాబాద్ నగరవాసులు, వస్త్ర, వాణిజ్య వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్​.. జనవరి 2న అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఒమిక్రాన్​ వ్యాప్తి కారణంగా ప్రభుత్వ ఆదేశాలతో ప్రదర్శనను నిలిపివేశాము. ప్రస్తుతం కొవిడ్​ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం వల్ల రేపటి నుంచి ఎగ్జిబిషన్​ను పునప్రారంభించాలని నిర్ణయించాము. గతంలో స్టాల్స్​ ఏర్పాటు చేసినవారంతా ఇప్పుడు మరళా తిరిగి వస్తున్నారు. 24 విభాగాల్లో దుకాణాలు అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 10.30గంటల వరకు ప్రదర్శన ఉంటుంది. ప్రదర్శన సందర్భంగా సందర్శకులు కొవిడ్​ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నాము. భౌతిక దూరం పాటించేలా రోడ్ల వెడల్పుతో పాటు స్టాళ్ల మధ్య దూరం కూడా పెంచాము. ప్రదర్శన 46రోజుల పాటు కొనసాగనుంది. అన్ని భద్రతా చర్యల మధ్య ఎగ్జిబిషన్​ పునప్రారంభమైంది. -ఆదిత్య మార్గం, ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి

ఇదీ చూడండి : Nampally Exhibition 2022: కరోనా ఆంక్షలతో.. నుమాయిష్​ నిలిపివేత

Last Updated :Feb 24, 2022, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.