ETV Bharat / state

CORONA CASES: రాష్ట్రంలో 691 కరోనా కేసులు.. 5 మరణాలు

author img

By

Published : Jul 21, 2021, 9:23 PM IST

రాష్ట్రంలో తాజాగా 691 మందికి కరోనా వైరస్‌ (corona) సోకినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 6,38,721‬ కి చేరింది. తాజాగా మహమ్మారితో ఐదుగురు మృతి చెందగా మొత్తం సంఖ్య 3,771కి పెరిగింది.

NEW 691 CORONA CASES REGISTERED IN TELANGANA
CORONA CASES: రాష్ట్రంలో 691 కరోనా కేసులు.. 5 మరణాలు

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,14,260 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 691 కొత్త కేసులు (corona cases) నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఐదుగురు మరణించారు. ఇప్పటి వరకు నమోదైన కేసులతో కలిపి మొత్తం సంఖ్య 6,38,721‬ కి చేరింది.

మహమ్మారి బారి నుంచి మరో 565 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 6,25,042‬ మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇవాళ మరణించిన ఐదుగురితో కలిపి మొత్తం సంఖ్య 3,771కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,908 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజా కేసుల్లో అత్యధికంగా 85 కేసులు జీహెచ్‌ఎంసీలో నమోదయ్యాయి. జిల్లాల వారీగా వచ్చిన కేసులను పరిశీలిస్తే... ఇలా ఉన్నాయి.

జిల్లాలు కేసులు
ఆదిలాబాద్ 02
భద్రాద్రి కొత్తగూడెం23
జగిత్యాల 26
జనగామ 10
జయశంకర్ భూపాలపల్లి09
జోగులాంబ గద్వాల్03
కామారెడ్డి 00
కరీంనగర్ 55
ఖమ్మం 56
కుమురంభీం ఆసిఫాబాద్07
మహబూబ్ నగర్08
మహబూబాబాద్ 19
మంచిర్యాల 37
మెదక్ 01
మేడ్చల్ మల్కాజ్‌గిరి 30
ములుగు 09
నాగర్ కర్నూల్05
నల్గొండ 38
నారాయణ పేట్ 02
నిర్మల్ 03
నిజామాబాద్ 07
పెద్దపల్లి 42
రాజన్న సిరిసిల్ల19
రంగారెడ్డి 29
సంగారెడ్డి 07
సిద్దిపేట 18
సూర్యాపేట 47
వికారాబాద్ 05
వనపర్తి 09
వరంగల్ రూరల్ 25
వరంగల్ అర్బన్41
యాదాద్రి భువనగిరి14
జీహెచ్‌ఎంసీ85

ఇదీ చూడండి: Corona Cases: కొత్తగా 746 మందికి వైరస్​.. మరో ఐదు మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.