ETV Bharat / state

Mynampally Hanumantha Rao joined Congress Party : కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి.. పార్టీ కండువా కప్పిన ఖర్గే

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2023, 8:36 PM IST

Updated : Sep 28, 2023, 10:28 PM IST

Mynampally Hanumantha Rao
Mynampally Hanumantha Rao joined Congress Party

Mynampally Hanumantha Rao joined Congress Party in Delhi : బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. మైనంపల్లితో పాటు వేముల వీరేశం, కుంభం అనిల్​కుమార్​ పార్టీ కండువా కప్పుకున్నారు.

Mynampally Hanumanth Rao Joined Congress Party in Delhi : ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే(AICC Chief Kharge) సమక్షంలో బీఆర్​ఎస్​ నాయకుడు, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Mynanpally Hanumantha Rao) కాంగ్రెస్​ పార్టీలో చేరారు. మైనంపల్లితో పాటు రోహిత్​, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్​ కుమార్​ కూడా కాంగ్రెస్​ పార్టీ కండువా కప్పుకున్నారు. దిల్లీలోని ఖర్గే నివాసం 10 రాజాజీ మార్గ్​లో పార్టీలో చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జ్​ మాణిక్​రావ్​ ఠాక్రే, తదితరులు పాల్గొన్నారు.

మల్కాజిగిరి ఎమ్మెల్యే టికెట్​ తనకు ఇచ్చినా.. మెదక్​ టికెట్​ తన కుమారుడు రోహిత్​కు మైనంపల్లి బీఆర్​ఎస్​ అధినేతను అడిగారు. అందుకు సీఎం కేసీఆర్​ ససేమిరా అనడంతో.. బీఆర్​ఎస్​ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్​ పార్టీలో చేరడానికి వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. తన అనుచరులతో కలసి వారం క్రితం గాంధీభవన్​కు వెళ్లి రేవంత్​ రెడ్డిని కలిశారు. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు.

Mynampally Speech at Delhi : తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడుతుందని మైనంపల్లి హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ అనుకూలమైన వాతావరణ తెలంగాణలో ఉందని అన్నారు. సర్వేల ఆధారంగా అధిష్ఠానమే సీట్లను నిర్ణయిస్తుందని తెలిపారు. సర్వేల ఆధారంగానే మేం అభ్యర్థులుగా ఉండనున్నామన్నారు. బీఆర్​ఎస్​లో ఎంత చేయాలో.. అంత చేశానని.. కార్యకర్తలంతా తనతోనే ఉన్నారని పేర్కొన్నారు.

"తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్‌కు అనుకూలమైన వాతావరణం ఉంది. సర్వేల ఆధారంగా అధిష్ఠానమే సీట్లను నిర్ణయిస్తుంది. సర్వేల ఆధారంగానే మేం అభ్యర్థులుగా ఉండనున్నాం. బీఆర్​ఎస్​లో ఎంత చేయాలో.. అంత చేశాను. కార్యకర్తలంతా నాతోనే ఉన్నారు." - మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే

Mynampally Hanumantha Rao joined Congress Party కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి.. పార్టీ కండువా కప్పిన ఖర్గే

MLA Mynampally on Harish Rao : మెదక్​ టికెట్​ సిట్టింగ్​ ఎమ్మెల్యేకే.. హరీశ్‌ రావుపై తీవ్ర విమర్శలు చేసిన మైనంపల్లి

Mynampally joined Congress Party in Presence of Mallikarjuna Kharge : బీఆర్​ఎస్​లో ఉన్నప్పుడు మొదటి నుంచి మల్కాజిగిరి, మెదక్​ స్థానాలు కావాలని మైనంపల్లి ఆశించారు. కానీ మల్కాజిగిరి స్థానం మాత్రమే ఇచ్చి.. మెదక్​ తన కుమారుడికి ఇవ్వలేదు. అప్పటి నుంచి బీఆర్​ఎస్​ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. అలాగే తిరుమల దర్శనానికి వెళ్లి.. దర్శన అనంతరం మంత్రి హరీశ్​రావుపై ధ్వజమెత్తారు. అప్పటి నుంచి బీఆర్​ఎస్​కు దూరంగా ఉంటూ వస్తున్న మైనంపల్లి.. కాంగ్రెస్​ నేతలతో సంప్రదింపులు జరిపారు.

తన కుమారుడు రోహిత్​కు మెదక్​ టికెట్​, తనకు మల్కాజిగిరి టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్​ అధినాయకత్వాన్ని కోరారు. అందుకు కాంగ్రెస్​ నుంచి ఎలాంటి సిగ్నల్​ వచ్చిందో తెలియదు కానీ.. కాంగ్రెస్​ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తనను నమ్ముకున్న నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడతానని తెలిపారు. తమ కార్యకర్తలపై ఇప్పటి నుంచే కేసులు పెడుతున్నారని.. బీఆర్​ఎస్ పార్టీ​పై మైనంపల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈలోపు మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించామని రేవంత్​ రెడ్డి బుధవారం స్పష్టం చేశారు.

Congress Party Assembly Election Plan : మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్​ పార్టీలో చేరిన వేళ మల్కాజిగిరి పార్టీ నేతల్లో అసమ్మతి పెరగకుండా.. కాంగ్రెస్​ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. రెండు రోజుల క్రితం మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్​తో హస్తం నేతలు భేటీ అయ్యారు. మైనంపల్లి రాకతో తన టికెట్​పై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో.. నేతలు మంతనాలు జరుపుతున్నారు. రాష్ట్ర నేతలు ఎన్ని మంతనాలు జరిపిన మల్కాజిగిరి సీటుపై ఇంకా స్పష్టత లేదని.. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానం నుంచే పోటీ చేస్తానని నందికంటి శ్రీధర్​ మొండిపట్టు పట్టారు.

Mynampally Clarifies on Constituency Change Rumours : 'మల్కాజిగిరి నుంచే పోటీ.. కార్యకర్తల కోసం ప్రాణత్యాగానికి సిద్ధమే'

MLA Mynampally Hanmantha Rao Resigned BRS : బీఆర్ఎస్​కు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాజీనామా

Last Updated :Sep 28, 2023, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.