ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సిట్‌ ముందుకు ప్రతాప్‌, చిత్రలేఖ.. శ్రీనివాస్ గైర్హాజరు

author img

By

Published : Nov 25, 2022, 10:55 AM IST

Updated : Nov 25, 2022, 1:23 PM IST

SIT Enquiry in MLAs poaching case

SIT Enquiry in MLAs Poaching Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో న్యాయవాది ప్రతాప్‌ గౌడ్‌, నందకుమార్‌ భార్య చిత్రలేఖ సిట్ ముందుకు హాజరయ్యారు. న్యాయవాది ప్రతాప్ గౌడ్.. నందకుమార్‌తో పలు లావాదేవీలు నిర్వహించడంతో పాటు, కలిసి ప్రయాణించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ముక్కుకు సర్జరీ కావడంతో లాయర్ శ్రీనివాస్​ ఇవాళ సిట్ ముందు హాజరు కాలేదు.

SIT Enquiry in MLAs Poaching Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నోటీసులు అందుకున్న మరో ఇద్దరు సిట్‌ ముందుకొచ్చారు. న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌తో పాటు నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ విచారణకు హాజరయ్యారు. ఫాంహౌజ్‌లో పట్టుబడిన వారితో ఉన్న సంబంధాలపై ప్రతాప్‌గౌడ్‌ను.. నందకుమార్‌ ఆర్థిక లావాదేవీలపై చిత్రలేఖను ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరికీ సిట్‌ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

SIT Enquiry in MLAs Poaching Case: టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులకు ఎరవేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ విచారణలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఫాంహౌజ్‌లో పట్టుబడిన వారితో పాటు మరో నలుగురిని నిందితుల జాబితాలో చేర్చిన సిట్‌.. ఈ వ్యవహారంతో సంబంధమున్న వారందరికీ నోటీసులు జారీచేస్తూ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌, నందకుమార్‌ భార్య చిత్రలేఖ సిట్‌ ముందు హాజరయ్యారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన తాఖీదుల మేరకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు వీరు చేరుకున్నారు. న్యాయవాది ప్రతాప్‌గౌడ్.. నందకుమార్‌తో పలు లావాదేవీలు నిర్వహించడంతో పాటు ఇద్దరూ కలిసి ప్రయాణాలు సాగించినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నందకుమార్, రామచంద్రభారతి మొబైల్ ఫోన్లలో డేటా సేకరించారు. వీరితో ప్రతాప్‌గౌడ్‌కున్న పరిచయాలపై సిట్ అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. కాగా సిట్ నోటీసులపై ఇప్పటికే ప్రతాప్‌గౌడ్ హైకోర్టును ఆశ్రయించగా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని సిట్ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

మరోవైపు నందకుమార్‌కు సంబంధించిన వ్యాపారులు, ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఆయన భార్య చిత్రలేఖను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని లావాదేవీలు చిత్రలేఖ బ్యాంకు ఖాతాల నుంచి కూడా జరిగినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. సిట్‌ విచారణకు రావాల్సిన న్యాయవాది శ్రీనివాస్‌.. అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. న్యాయవాది శ్రీనివాస్ ముక్కుకు శస్త్రచికిత్స జరిగటంతో ఆస్పత్రిలో ఉన్నందున సిట్ ఎదుట హాజరుకాలేనని సమాచారమిచ్చారు. దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

ఎమ్మెల్యేలకు ఎరవేసిన వ్యవహారంలో ఫామ్‌హౌస్‌లో పట్టుబడిన నలుగురితో పాటు తాజాగా మరో నలుగురిని సిట్‌ నిందితుల జాబితాలో చేర్చింది. భాజపా కీలక నేత బీఎల్‌ సంతోష్‌, కేరళ వైద్యుడు డాక్టర్ జగ్గుస్వామి, బీడీజేఎస్‌ నేత తుషార్, కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్‌ను నిందితుల జాబితాలో చేర్చుతున్నట్లు ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో సిట్ మెమో దాఖలు చేసింది. కేసులో కీలకంగా భావిస్తున్న జగ్గుస్వామి ఆచూకీ లభించకపోవడంతో అతడి సంబంధికులకు సిట్ 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసింది. అలాగే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు పేరు తెరపైకి వచ్చింది. ఈ నెల 29న రఘురామ విచారణకు హాజరుకావాలంటూ 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేసింది.

ఇవీ చదవండి:

Last Updated :Nov 25, 2022, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.