ETV Bharat / state

ఆచార్య జయశంకర్​కు నివాళులర్పించిన మంత్రి ప్రశాంత్​రెడ్డి

author img

By

Published : Jun 21, 2020, 8:31 PM IST

Minister Prashanth Reddy
Minister Prashanth Reddy

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించారు. శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి హైదరాబాద్​లో​ జ‌య‌శంక‌ర్ చిత్ర‌ప‌టానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

తెలంగాణ సాధనే లక్ష్యంగా ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్యమానికే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్​ అని శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​లో​ జ‌య‌శంక‌ర్ చిత్ర‌ప‌టానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. జీవితకాల ఉద్యమకారుడైన ఆచార్య జయశంకర్ తన చివరి శ్వాస వరకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడారని ప్రశాంత్​రెడ్డి తెలిపారు.

తెలంగాణ భవిష్యత్ తరాలకు ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని మంత్రి వేముల అన్నారు. ఆచార్య జయశంకర్​ కలల సాకారం దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్నారన్నారు. బీడు భూముల్లోకి నీళ్లు పారినపుడే తెలంగాణ రైతుల గోస తొలగిపోతుందన్న జయశంకర్ ఆశయాన్ని కేసీఆర్ నిజం చేసి రైతుల కళ్లల్లో వెలుగులు నింపారని మంత్రి చెప్పారు.

ఇదీ చూడండి : ఎన్నికల్లో 'కరోనా ట్రెండ్​'కు ఆ రాష్ట్రం నుంచే నాంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.