ETV Bharat / state

'వృద్ధాప్యంలోను క్రీడలపట్ల ఆసక్తి చూపడం హర్షణీయం'

author img

By

Published : Feb 11, 2021, 7:56 PM IST

'వృద్ధాప్యంలోను క్రీడలపట్ల ఆసక్తి చూపడం హర్షణీయం'
'వృద్ధాప్యంలోను క్రీడలపట్ల ఆసక్తి చూపడం హర్షణీయం'

వృద్ధులు కూడా క్రీడలపట్ల ఆసక్తి చూపడం హర్షణీయమని మంత్రి శ్రీనివాస్ ​గౌడ్​ అన్నారు. తెలంగాణ స్టేట్ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్​షిప్​ బ్రోచర్​ను... ఎల్బీ స్టేడియంలో మంత్రి ఆవిష్కరించారు.

క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. ఎమ్​ఎల్​ఆర్​ఐటీ దిండిగల్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్​ మాస్టర్​ అథ్లెటిక్​ పోటీలకు సంబంధించిన బ్రోచర్​ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిటీ ఛైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అంజి రెడ్డి పాల్గొన్నారు.

ఈ నెల 13నుంచి ప్రారంభం కానున్న పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల నుంచి 750 మంది క్రీడాకారులు వివిధ క్రీడాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. 35 ఏళ్ల నుంచి వందేళ్ల లోపువారు ఈ పోటీల్లో పాల్గొంటారు. క్రీడల్లో గెలిచిన వారికి బహుమతితో పాటు ప్రతిభ కనబరిచిన వారిని రాయదుర్గంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఈనెల 13 ఈ పోటీలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభిస్తారని... 14న జరిగే ముగింపు కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చూడండి: ఘట్​కేసర్ అత్యాచారం కేసులో నలుగురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.