ETV Bharat / state

Srinivas Goud: 'పర్యావరణాన్ని పెంపొందించేందుకు సీడ్​ గణేశ్​లు'

author img

By

Published : Sep 9, 2021, 2:00 PM IST

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా క్రీడాకారులకు మంత్రి శ్రీనివాస్​ గౌడ్ సీడ్​ గణేశ్ విగ్రహాలను పంపిణిీ చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వెల్లడించారు. సీడ్​ గణేశ్​లను తయారు చేయించడం అభినందనీయమన్నారు.

SEED_GANESH
సీడ్​ గణేష్ విగ్రహాల పంపిణీ

పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 1001సీడ్ గణేశ్ విగ్రహాలను క్రీడాకారులకు ఉచితంగా పంపిణీ చేశారు.

సీడ్ గణేశ్​లను తయారు చేయించడం అభినందనీయమన్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పర్యావరణం పెంపొందించేందుకు సీడ్ గణేశ్​లు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. సీడ్ గణేశ్​ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ప్రతి క్రీడాకారుడు సీడ్ గణేశ్​లను పూజించి ఇంట్లోనే నిమజ్జనం చేయాలని కోరారు.

సీడ్​ గణేష్ విగ్రహాల పంపిణీ

ఇదీ చూడండి: HIGH COURT: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.