ETV Bharat / state

'హోంలలోని బాలికలందరికి సుకన్య సమృద్ధి పథకం'

author img

By

Published : Feb 10, 2021, 4:48 PM IST

minister sathyavathi rathode, sadguru sevalala maharaj
మంత్రి సత్యవతి రాఠోడ్​, సద్గురు సేవాలాల్​ మహారాజ్​

సుకన్య సమృద్ధి పథకంలో భాగంగా బాలికలకు నెలకు రూ. 1000 చొప్పున పోస్టల్​ శాఖకు నిధులు చెల్లిస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ పేర్కొన్నారు. ఈ శాఖ పరిధిలోని హోంలలో ఉన్న బాలికలందరికి ఈ సాయం వర్తిస్తుందని తెలిపారు. సద్గురు సేవాలాల్​ మహారాజ్​ 282వ జయంతి సందర్భంగా హైదరాబాద్​లో ప్రత్యేక పోస్టల్​ కవర్​ను మంత్రి సత్యవతి ఆవిష్కరించారు.

స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలోని హోంలలో ఉన్న బాలికలకు నెలకు రూ.1,000 చొప్పున పోస్టల్​ శాఖకు.. తమ మంత్రిత్వ శాఖ తరఫున నిధులు చెల్లిస్తామని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. సుకన్య సమృద్ధి పథకంలో భాగంగా ఈ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్​ అబిడ్స్​లోని డాక్ సదన్​లో సద్గురు సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహారాజ్ ప్రత్యేక పోస్టల్ కవర్​ను మంత్రి సత్యవతి ఆవిష్కరించారు.

minister sathyavathi rathode, sadguru sevalala maharaj
మంత్రి సత్యవతి రాఠోడ్​, సద్గురు సేవాలాల్​ మహారాజ్​

పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుకన్య సమృద్ధి పథకంతో హోంలలో ఉండే నిరుపేద బాలికలను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సత్యవతి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, పోస్టల్ శాఖకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

'హోంలోని బాలికల తరఫున పోస్టల్​ శాఖకు రూ. 1000'

గిరిజన ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ పేరిట ప్రత్యేక పోస్టల్ కవర్​ను విడుదల చేయడం సంతోకరమని అభిప్రాయపడ్డారు. సంత్ సేవాలాల్ జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించడానికి చాలా మంది కృషి చేస్తున్నారన్నారు. సేవాలాల్ జయంతిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అధికారికంగా నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు.

ఇదీ చదవండి: కిడ్నీ వ్యాధిగ్రస్థులకు పింఛన్​ ఇవ్వాలని కేసీఆర్​కు విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.