ETV Bharat / state

ఒకప్పుడు ఆ రాష్ట్రాలు.. ఇప్పుడు తెలంగాణే ఫస్ట్: కేటీఆర్

author img

By

Published : Jul 4, 2022, 8:31 PM IST

హైదరాబాద్‌ హెచ్ఐసీసీలో ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా.. ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. వివిధ రంగాల్లో రాణిస్తున్నవారికి కేటీఆర్ అవార్డులు ప్రదానం చేశారు.

Minister KTR  presented the  FTCCI  Excellence Awards to industry leaders, and entrepreneurs in Hyderabad
Minister KTR presented the FTCCI Excellence Awards to industry leaders, and entrepreneurs in Hyderabad

వ్యాపార రంగం విషయంలో ప్రభుత్వ జోక్యం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టీఎస్‌ఐపాస్‌లో కీలక నిబంధనలు పొందుపర్చామని వివరించారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో... వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి ఇచ్చే ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవానికి... కేటీఆర్ హాజరయ్యారు. మొత్తం 19 కేటగిరీల్లో అవార్డులు అందజేశారు.

పరిశ్రమల విషయంలో ఒకప్పుడు గుజరాత్‌ మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు ముందుండేవన్న ఆయన... ఇప్పుడు తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. సులభతర వాణిజ్యంలో ఎక్కువసార్లు.. రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినట్లు గుర్తుచేశారు. దేశంలో ప్రాంతాలను బట్టి ఆయా భాష మాట్లాడుతుంటారన్న ఆయన... భాషను బట్టి ప్రతిభను అంచనా వేయవద్దని తెలిపారు.

'సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం మాదిరిగా.. మేం పెట్టుబడిదారులకు ఇక్కడ స్వీయధ్రువీకరణ హక్కు కల్పించాం. చట్ట ప్రకారం మా వ్యాపారం చేసుకుంటామని ఎవరైనా స్వీయధ్రువీకరణ ఇస్తే చాలు... ఎలాంటి ప్రభుత్వ అనుమతులు అవసరం లేకుండా మొదటి రోజు నుంచే.. వారి పరిశ్రమలను ప్రారంభించుకోవచ్చు. ఈ విషయాన్ని దేశంలో ఏ రాష్ట్రమూ చెప్పదు. ప్రభుత్వ మద్దతు అంటే.... ఈ తరహా సాధికారతను కల్పించడమే. దీనిని మా ముఖ్యమంత్రి చేశారు. ప్రభుత్వ జోక్యం ఎంత తక్కువ ఉంటే.. అంత మంచిది.' -కేటీఆర్‌, పరిశ్రమల శాఖ మంత్రి

హెచ్ఐసీసీలో ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం

ఇవీ చదవండి: Woman murder:సైకో కిల్లర్ దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.