ETV Bharat / state

KTR On Modi : 'తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలి'

author img

By

Published : Feb 8, 2022, 9:40 PM IST

KTR On Modi
KTR On Modi

KTR On Modi : రాష్ట్ర విభజన తీరుపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు తీవ్రంగా ఖండించారు. దశాబ్దాల స్ఫూర్తి దాయక పోరాటాన్ని, ప్రజల త్యాగాన్ని నరేంద్రమోదీ పదే పదే అవమానిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.

KTR On Modi : రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ డిమాండ్​ చేశారు. రాజ్యసభ సాక్షిగా తెలంగాణను అవమానించే విధంగా ప్రధాని మాట్లాడారని కేటీఆర్​ ఆరోపించారు. ప్రధాని అసంబద్ధ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

కర్ణాటకలో హిజాబ్ వివాదంపై స్పందిస్తూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. హిజాబ్ అంశం తీవ్ర నిరాశ, ఆందోళన కలిగించిందన్నారు. అయితే హిజాబ్ వివాదం వెనక అసలు వ్యూహమేంటో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయంటే.. ఎన్నికలు జరుగుతున్నాయనేది దేశంలో అందరూ అనుకునేదేనని కేటీఆర్ పేర్కొన్నారు.

  • Utterly disgraceful of you Mr. Prime Minister repeatedly insulting the decades of spirited struggle & sacrifices of the people of #Telangana

    I strongly condemn the absurd comments of PM & demand that he apologise to the people of Telangana https://t.co/hZ76iLaKZ7

    — KTR (@KTRTRS) February 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలంగాణ ప్రజల దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, త్యాగాలను ప్రధాని మోదీ పదే పదే అవమానిస్తున్నారు. ప్రధాని చేసిన అసంబద్ధ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ వ్యాఖలపై తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. -ట్విట్టర్​లో మంత్రి కేటీఆర్​

ఇదీ చూడండి : Harishrao on Modi: 'ప్రధాని మాటలు.. తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.