ఉపాధిహామీ పథకానికి సంబంధించిన కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం దిల్లీ వెళ్లి రావాలని అధికారులను పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. పెండింగ్లో ఉన్న తొమ్మిది రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలన్నారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో పంచాయతీరాజ్శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్రావు సంబంధిత అంశాలంపై మంత్రి సమావేశం నిర్వహించారు. కొత్తగా తీసుకురావాల్సిన నిధులు, పనుల కోసం తీవ్రంగా కృషి చేయాలని సూచించారు.
ఉపాధిహామీ అనుసంధాన పనులు కొనసాగాలని.. ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడాలని తెలిపారు. పల్లెల్లో పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, కల్లాల పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలో పనులన్నీ పూర్తయ్యేలా అధికారులు క్షేత్ర పరిశీలన చేయాలని ఆదేశించారు. కోటి వృక్షార్చనలో నాటిన మొక్కలను సంరక్షించాలని.. స్థానిక ప్రజాప్రతినిధులు ఆ బాధ్యత తీసుకోవాలని మంత్రి కోరారు.