ETV Bharat / state

భాజపా పేదలతో చెలగాటం ఆడుతోంది: వెంకటేశ్వర్లు

author img

By

Published : Nov 20, 2020, 11:35 PM IST

భాజపా పేదలతో చెలగాటం ఆడుతోంది: వెంకటేశ్వర్లు
భాజపా పేదలతో చెలగాటం ఆడుతోంది: వెంకటేశ్వర్లు

కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న కేంద్రంలో భాజపా ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండలి చీఫ్ విప్ వెంకటేశ్వర్లు ఆరోపించారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా... ఆస్తులను బడాబాబులకు కట్టబెడుతుందని మండిపడ్డారు.

కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న కేంద్రంలో భాజపా ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండలి చీఫ్ విప్ వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఖైరతాబాద్​ డివిజన్​ గన్​ఫౌండ్రి తెరాస అభ్యర్థి మమత గుప్తా కోఠి ఈసామియా బజార్​లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా... ఆస్తులను బడాబాబులకు కట్టబెడుతుందని వెంకటేశ్వర్లు మండిపడ్డారు. వరద సహాయంపై అడ్డుకున్నా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... తన సంతకమే కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని... బల్దియా ఎన్నికల పేరుతో అల్లర్లు సృష్టించాలని భాజపా నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భాజపా, కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొట్టాలంటే... తమ అభ్యర్థులను ఐక్యమత్యంగా కలిసి గెలిపించుకోవాలన్నారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్, భాజపా నుంచి వచ్చిన కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు.

ఇదీ చదవండి: ముగిసిన నామినేషన్ల సందడి.. చివరిరోజు కోలాహలం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.