ETV Bharat / state

Gun Firing At Old City : పాతబస్తీలో కాల్పుల కలకలం.. లైసెన్స్​డ్​ రివాల్వర్​తో..

author img

By

Published : Jun 18, 2023, 10:06 AM IST

Updated : Jun 18, 2023, 12:34 PM IST

Gun Firing At Old City Hyderabad : ఇంటి కొనుగోలు.. ఇద్దరి మధ్య కాల్పులకు దారి తీసింది. కాసేపు ఆ ప్రాంత వాసులందరినీ భయబ్రాంతులకు గురి చేసింది. కేసు పెండింగ్​లో ఉన్న ఇల్లు.. ఎలా కొన్నావంటూ కొనుగోలుదారుడితో గొడవకు దిగాడో న్యాయవాది. అది కాస్తా పెరిగి పెద్దదై.. ఇరువర్గాలు కత్తులు, కర్రలతో దాడి చేసుకునేంత వరకు వెళ్లింది. కోపోద్రిక్తుడైన న్యాయవాది తన లైసెన్స్​డ్​ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు.

Firing
Firing

Lawyer Fires Gun In a Clash at Old City : హైదరాబాద్​ పాతబస్తీలో తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. ఆస్తి తగాదాల కారణంగా జరిగిన గొడవలో ఓ న్యాయవాది తన లైసెన్స్​డ్​ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఇరు వర్గాలు కర్రలు, కత్తులతో దాడులు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉండే అరఫత్‌ అనే వ్యక్తి మీర్‌చౌక్‌ లో ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆ ఇంటి పక్కన నివసించే వారు అతనితో గొడవకు దిగారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా.. ఇల్లు ఎలా కొనుగోలు చేశావంటూ న్యాయవాది మసూద్​ వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఇరువర్గాలకు చెందిన వారు కర్రలు, కత్తులతో దాడులకు దిగారు.

కోపోద్రిక్తుడైన న్యాయవాది ఇంట్లో ఉన్న తన లైసెన్స్​డ్​ తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపాడు. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని న్యాయవాది సహా మరో వర్గం వారినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ముందు జాగ్రత్తగా స్థానికంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయంలో గత శనివారమే ఇల్లు కొనుగోలు చేసిన అరఫత్‌ అనే వ్యక్తి తమకు ఫిర్యాదు చేశాడని మీర్‌చౌక్‌ ఏసీపీ తెలిపారు. మొత్తం మీద పాతబస్తీలో కాల్పులు కలకలం సృష్టించాయి.

'గత శనివారం అరఫత్ అనే వ్యక్తి మీర్​చౌక్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. నేను ఇల్లు కొనుక్కున్నాను కానీ.. ఆ ఇంట్లోకి పోదామంటే పక్కన వారు పోనివ్వడం లేదు. ఎందుకు వెళ్లనివ్వడం లేదని అడిగితే.. ఆ ఇల్లు గురించి కేసులు నడుస్తున్నాయని.. అలా ఎలా కొన్నావని అంటున్నారని ఫిర్యాదులో తెలిపాడు. తను ఇచ్చిన కంప్లైంట్​ తీసుకోని ఎఫ్​ఐఆర్​ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. -దామోదర్‌ రెడ్డి, మీర్‌చౌక్‌ ఏసీపీ

Firing Took Place At Indalwai Toll Gate : ఇటీవలె నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయి టోల్​గేట్​ వద్ద కాల్పులు జరిగాయి. తన వాహనంపైకి దొంగలు దూసుకొస్తున్నారని అతని ఆత్మరక్షణ కోసం ఎస్సై గాల్లో కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​ జిల్లా ముప్కాల్​ మండలంలోని విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​ కాపర్​ కాయిల్​ చోరీ చేసిన ముఠా 44వ జాతీయ రహదారిపై వెళ్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయం తెలుసుకున్న ముప్కాల్​ పోలీసులు వారిని వెంబడించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి..

ఇవీ చదవండి:

Last Updated :Jun 18, 2023, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.