ETV Bharat / state

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యుడు రవి కుమార్​ పిళ్లై బదిలీ

author img

By

Published : Dec 7, 2022, 9:52 AM IST

KRMB member Ravi Kumar Pillai transfer: కేఆర్​ఎంబీ సభ్యుడిగా ఉన్న రవి కుమార్​ పిళ్లైను.. కేంద్ర జలసంఘం ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Ravi Kumar Pillai transferred
రవికుమార్​ పిళ్లై

KRMB member Ravi Kumar Pillai transferred: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యుడు రవి కుమార్ పిళ్లై బదిలీ అయ్యారు. కేఆర్​ఎంబీ సభ్యుడుగా ఉన్న ఆయనని.. కేంద్ర జలసంఘం ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా బోర్డు సభ్యుడుగా ఉన్న రవికుమార్​ పిళ్లై ఆర్ఎంసీ కన్వీనర్​గా కూడా బాధ్యతలు అప్పగించారు.

శ్రీశైలం-నాగార్జునసాగర్ జలాశయాల రూల్ కర్వ్​స్​, జల విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో జలాల వినియోగం మార్గదర్శకాలపై కసరత్తు చేశారు. గత శనివారం ఆర్​ఎంసీ చివరి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణ సభ్యులు ఆ రోజు హాజరయ్యారు. శ్రీశైలం రూల్ కర్వ్​స్​ విషయంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయని పిళ్లై తెలిపారు. సోమవారం జరిగిన సమావేశానికి తెలంగాణ సభ్యులు హాజరుకాలేదు. దీంతో బోర్డు సభ్యులు, ఏపీ సభ్యులు మాత్రమే నివేదికపై సంతకం చేశారు.

ఆర్ఎంసీ ముసాయిదా నివేదికలోని అంశాలు.. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని అభ్యంతరం చెబుతూ కేఆర్​ఎంబీకి నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్​కుమార్​ లేఖ రాశారు. ఆర్ఎంసీ సిఫార్సులను పక్కన పెట్టాలని కోరారు. తాము అంగీకరించని అంశాలను కూడా ముసాయిదాలో పేర్కొన్నారని దీనిపై కన్వీనర్ వివరణ ఇచ్చేలా ఆదేశించాలని కేఆర్​ఎంబీ ఛైర్మన్​కు విజ్ఞప్తి చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో రవికుమార్ పిళ్లై బదిలీ చర్చనీయాంశమైంది. వాస్తవానికి పిళ్లై కూడా కొంత కాలంగా బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.