ETV Bharat / state

Kishan Reddy latest news : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్​రెడ్డి బాధ్యతల స్వీకరణ

author img

By

Published : Jul 21, 2023, 12:49 PM IST

Kishan Reddy latest Comments : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం చార్మినార్​ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తెలుగుతల్లి పైవంతెన వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి అంబర్​పేటలో పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బషీర్‌బాగ్‌లోని కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిషన్​రెడ్డి వెంట ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్​, రఘునందన్​రావు ఉన్నారు.

Kishan Reddy
Kishan Reddy

Kishan Reddy Taking Charge On BJP State President : తెలంగాణ బీజేపీ నూతన సారథిగా కేంద్రమంత్రి గంగాపురం కిషన్​రెడ్డి నాలుగోసారి బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 12:40 గంటలకు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైకమాండ్​ ఆదేశాలను అనుసరించి ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఉదయం 7 గంటల 30 నిమిషాలకు పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 8:20 గంటలకు అంబర్​పేటకు చేరుకుని మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాం వద్ద నివాళులు అర్పించారు. అక్కడి నుంచి నేరుగా బషీర్​బాగ్​లోని కనకదుర్గ అమ్మవారి ఆలయానికి 8:50 గంటలకు చేరుకొని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం గన్​పార్క్​ వద్ద ఉన్న అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.

Kishan Reddy Rally at Gunpark : అక్కడి నుంచి నేరుగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. కిషన్​రెడ్డితో ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్​, రఘునందన్​రావుతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముందుగా నిర్ణయించుకున్న సమయం ప్రకారం 11 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నప్పటికీ.. వర్షం కారణంగా మధ్యాహ్నం 12:40 గంటలకు ఆయన బీజేపీ రాష్ట్ర రథ సారథిగా బాధ్యతలు స్వీకరించారు.

బీజేపీ సారధిగా నాల్గొసారి బాధ్యతలు స్వీకరణ: తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను అనసరించి బీజేపీ హైకమాండ్​ కొద్ది రోజుల క్రితం పార్టీ పదవుల్లో స్వల్ప మార్పులు చేసిన సంగతి తెలిసిందే.. అంతకు ముందు వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన బండి సంజయ్​ను తొలగించి కిషన్​రెడ్డిని నియమించింది. దీంతో ఆయన నాల్గొసారి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా కిషన్​రెడ్డి నిల్చిపోనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు రెండు పర్యాయాలు, తెలంగాణకు తొలి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన కిషన్​రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు.

బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అధ్యక్షుడి హోదాలో తొలి కోర్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ఎన్నికలకు సన్నద్ధం, బీఆర్​ఎస్​పై ఉద్యమ కార్యాచరణ అంశాలపైన చర్చించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.