ETV Bharat / state

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్

author img

By

Published : Feb 22, 2023, 1:30 PM IST

కంగనారనౌత్
కంగనారనౌత్

Kangana Ranaut in Green India Challenge: పచ్చదనం పెంపొందించే లక్ష్యంగా ప్రారంభించిన కార్యక్రమం గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​కు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. తాజాగా సినీ నటి కంగనా రనౌత్​ ఈ ఛాలెంజ్​లో భాగంగా శంషాబాద్​లో మొక్కలు నాటారు.

Kangana Ranaut in Green India Challenge : పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా మానవ జీవితం అల్లకల్లోలం కాకుండా పచ్చదనంతో కళకళలాడాలనే ఉద్దేశంతో, తెలంగాణలో వనాలను పెంచడమే లక్ష్యంగా అడుగులు వేయడానికి రాజ్యసభ సభ్యుడు ఎంపీ జోగినపల్లి సంతోశ్​​ కుమార్​ ప్రారంభించిన మహోత్తరమైన కార్యక్రమం గ్రీన్​ఇండియా ఛాలెంజ్​. ఈ మహా క్రతువులో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ భాగస్వామ్యం అవుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటారు.

Kangana Ranaut participated in Green India Challenge : రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్​లో పంచవటి పార్క్​లో కంగనా రనౌత్ మొక్కలు నాటారు. ప్రముఖ జ్యోతిష్యుడు బాలు మున్నంగి ఛాలెంజ్​ను స్వీకరించి మొక్కలు నాటినట్లు కంగనా రనౌత్ పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా రాజ్యసభ ఎంపీ సంతోశ్​ కుమార్ కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయం అని కొనియాడారు. ఈ కార్యక్రమం ద్వారా అందరిలో పచ్చదనంపై అవగాహన వస్తుందన్నారు. ఈ ఛాలెంజ్​ను అందరూ స్వీకరించి మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంచాలని కోరారు. అనంతరం తన సోదరి రంగోలి చందర్, డాక్టర్ రీతూ రనౌత్ , అంజలీ చౌహాన్​లను గ్రీన్​ ఇండియో ఛాలెంజ్​లో మొక్కలు నాటాలని కంగనా రనౌత్ నామినేట్ చేశారు.

'గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​' అంటే.. హరితహారంలో ప్రతి వ్యక్తి తమ వంతు భాగస్వామ్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను సంతోశ్​ కుమార్​​ ప్రారంభించారు. తను మొక్క నాటి మరో ముగ్గురిని నామినేట్ చేయడమే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్దేశం. కార్యక్రమంలో భాగంగా పలువురు జాతీయ నాయకులు , రాష్ట్ర ప్రముఖులు, నేతలు, అధికారులు, క్రీడాకారులు, సినీనటులు, వివిధ వర్గాల వారు ఈ ఛాలెంజ్​ను స్వీకరించి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.