ETV Bharat / state

కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ నోటిఫికేషన్‌ పురోగతిపై నేడు కేంద్రం సమీక్ష

author img

By

Published : Jan 27, 2022, 2:21 AM IST

కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ నోటిఫికేషన్‌ పురోగతిపై నేడు కేంద్రం సమీక్ష
కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ నోటిఫికేషన్‌ పురోగతిపై నేడు కేంద్రం సమీక్ష

KRMB,GRMB: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల నోటిఫికేషన్ పరిధి అమలు పురోగతిని కేంద్ర జలశక్తి శాఖ ఇవాళ సమీక్షించనుంది. కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ రెండు బోర్డుల ఛైర్మన్లతో నేడు వర్చువల్ విధానంలో సమావేశం కానున్నారు. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ ఛైర్మన్లు, రెండు బోర్డుల సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు. గెజిట్ అమలుపై ఇటీవల రెండు రాష్ట్రాల సీఎస్​లతో చర్చించిన పంకజ్ కుమార్... ఇవాళ బోర్డు ఛైర్మన్లతో సమీక్షించనున్నారు. గెజిట్‌ అమలు పురోగతి, రాష్ట్రాల నుంచి అందిన వివరాలను తెలుసుకోనున్నారు.

KRMB,GRMB: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల నోటీఫికేషన్ పరిధి అమలు పురోవతిని కేంద్ర జలశక్తి శాఖ సమీక్షించనుంది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ రెండు బోర్డుల ఛైర్మన్లతో ఇవాళ వర్చువల్ విధానంలో సమావేశం కానున్నారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఛైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్, సభ్యులు భేటీలో పాల్గొంటారు. రెండు బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ గత జూలై 15న జారీ చేసిన నోటిఫికేషన్ అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రాజెక్టులను రెండు రాష్ట్రాలు బోర్డులకు స్వాధీనం చేయాల్సి ఉంది. ఆ దిశగా బోర్డుల సమావేశం, ఉపసంఘం భేటీలు జరిగినప్పటికీ ఇరు రాష్ట్రాలు ఒక్క ప్రాజెక్టును కూడా స్వాధీనం చేయలేదు.

బోర్డు ఛైర్మన్లతో సమీక్ష

రెండు బోర్డులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సీడ్ మనీ కింద 200 కోట్ల రూపాయల చొప్పున జమ చేయాల్సి ఉంది. అది కూడా జరగలేదు. గెజిట్ ప్రకారం అనుమతులు లేని ప్రాజెక్టులకు ఈ నెల 15వ తేదీ లోపు అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఆ ప్రక్రియ కూడా పూర్తి కావాల్సి ఉంది. గెజిట్ అమలుపై ఇటీవలే రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో చర్చించిన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్... ఇవాళ బోర్డు ఛైర్మన్లతో సమీక్షించనుంది. అమలు పురోగతి, రాష్ట్రాల నుంచి అందిన వివరాలు, సమాచారం, సహకారం తదితరాలను తెలుసుకోనున్నారు.

సమస్యల పరిష్కారం కోసం..

ప్రాజెక్టుల నిర్వహణ, అనుమతుల్లేని ప్రాజెక్టుల అంశానికి సంబంధించి బోర్డు ఛైర్మన్లకు దిశానిర్దేశం చేయనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే అత్యున్నత మండలి సమావేశం నిర్వహిస్తామని సీఎస్​లతో భేటీ సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి చెప్పారు. అందుకు సంబంధించిన అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ దిశగా కూడా బోర్డు ఛైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి చర్చించే అవకాశం ఉంది.

టెలిమెట్రీ స్టేషన్లను పరిశీలించనున్న కేఆర్​ఎంబీ సబ్ కమిటీ

మరోవైపు జూరాల, ఆర్డీఎస్, సుంకేశులతో పాటు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం ఇవాళ, రేపు పరిశీలించనుంది. కేఆర్ఎంబీ పరిధిలోకి తుమ్మిళ్ల ఎత్తిపోతలను తీసుకొచ్చేలా గెజిట్ నోటిఫికేషన్​లో పొందుపరిచారు. ఆర్డీఎస్ నుంచి దశాబ్దాలుగా రాష్ట్ర వాటాలో కనీసం నీరు కూడా రావడం లేదని... అందుకే తాము ప్రత్యామ్నాయంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల చేపట్టినట్లు తెలంగాణ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్, సుంకేశుల, తుమ్మిళ్ల ప్రాజెక్టులను పరిశీలించాలని కేఆర్ఎంబీ సబ్ కమిటీని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్ళై నేతృత్వంలోని ఉపసంఘం ఇవాళ, రేపు ప్రాజెక్టులను పరిశీలించనుంది. బోర్డు ప్రతినిధులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్లు కూడా బృందంలో ఉంటారు. ఇవాళ జూరాల వద్ద టెలిమెట్రీ స్టేషన్లను పరిశీలించనున్న సబ్ కమిటీ... రేపు ఆర్డీఎస్, సుంకేశుల ప్రాజెక్టులతో పాటు తుమ్మిళ్ల ఎత్తిపోతలను పరిశీలించనుంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.