ETV Bharat / state

సీజేఐని కలిసిన డీజీపీ, పోలీసు అధికారులు

author img

By

Published : Jun 13, 2021, 10:14 PM IST

cji
cji

రాజ్​భవన్ అతిధి గృహంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణను పలువురు ఐపీఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు ఇతర అధికారులు కలిశారు.

హైదరాబాద్​ రాజ్​భవన్ అతిథి గృహంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణను పలువురు ఐపీఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు అదనపు డీజీ జితేందర్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, రాచకొండ సీపీ మహేష్ భగవత్, ఇంటిలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సీజేని కలిసిన వారిలో ఉన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వత మొదటిసారి నగరానికి వచ్చిన ఆయనకు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి: 'చిన్న కూటములతో ప్రపంచాన్ని శాసించలేరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.