ETV Bharat / state

'ఇప్పటి వరకు 21,392 మెట్రిక్​ టన్నుల ఆక్సిజన్​ తరలింపు'

author img

By

Published : May 30, 2021, 9:31 PM IST

నేటి వరకు వివిధ రాష్ట్రాలకు 21,392 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్​ను చేరవేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. దేశవ్యాప్తంగా 313 ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్​లను నడిపించామని రైల్వే శాఖ ప్రకటించింది.

Oxigen Express Marathan
Oxigen Express Marathan

ఇప్పటి వరకు దేశంలోని 15 రాష్ట్రాలకు 1,274 ఆక్సిజన్ ట్యాంకర్లను సరఫరా చేశామని రైల్వే శాఖ తెలిపింది. మొత్తం 21,392 మెట్రిక్​ టన్నుల ప్రాణవాయువును తరలించినట్లు పేర్కొంది. మహారాష్ట్రకు 614 మెట్రిక్ టన్నులు, ఉత్తరప్రదేశ్​కు 3,797, మధ్యప్రదేశ్​కు 656, దిల్లీకి 5,476, హరియాణాకు 2,023, రాజస్థాన్​కు 98 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్​ తరలించినట్లు వెల్లడించింది.

కర్ణాటకకు 2,115 మెట్రిక్ టన్నులు, ఉత్తరాఖండ్​కు 320, తమిళనాడుకు 1,808, ఏపీకి 1,738, పంజాబ్​కు 225, కేరళకు 380, తెలంగాణకు 1,858, జార్ఖండ్​కు 38, అసోంకు 240 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్​ను సరఫరా చేసినట్లు భారతీయ రైల్వే పేర్కొంది.

ఇదీ చూడండి: Lockdown Extension: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.