ETV Bharat / state

IAS Transfers in Telangana : నలుగురు ఐఏఎస్​లు బదిలీ.. జీహెచ్​ఎంసీకి కొత్త కమిషనర్​

author img

By

Published : Jul 4, 2023, 7:52 PM IST

IAS Transfers in Telangana 2023 : రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు కమిషనర్​గా.. ప్రస్తుతం ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్న రొనాల్డ్ రోస్‌ను నియమిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు కమిషనర్‌గా ఉన్న లోకేష్ కుమార్‌ను తెలంగాణ అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది.

IAS Transfers
IAS Transfers

Telangana IAS Transfers 2023 : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ.. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగంలో ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేసింది. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌, ఆబ్కారీ శాఖకి కొత్త కమిషనర్లు వచ్చారు.

New Commissioner to GHMC : జీహెచ్ఎంసీకి కొత్త కమిషనర్ వచ్చారు. ప్రస్తుతం ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్న రొనాల్డ్ రోస్‌ను.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ కమిషనర్‌గా నియమించారు. ఇప్పటివరకు కమిషనర్‌గా ఉన్న లోకేష్ కుమార్‌ను... రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగణంగా లోకేష్ కుమార్‌ను బదిలీ చేసిన సర్కార్‌... ఆయన స్థానంలో బల్దియా బాధ్యతలను రొనాల్డ్ రోస్‌కు అప్పగించింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఉన్న... సర్ఫరాజ్ అహ్మద్‌ను రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా... ఈసీ నియమించింది. సర్ఫరాజ్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం... వెయిటింగ్‌లో ఉన్న ముషారఫ్ అలీ ఫారుఖీని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు...... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Officers Transfers in Telangana 2023 : త్వరలోనే ఆ 100 మంది అధికారుల బదిలీ..!

త్వరలోనే మరి కొంతమంది అధికారుల బదిలీలు : ఈ బదిలీలకు కొనసాగింపుగా మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఆర్థికశాఖ కార్యదర్శి, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి, పురపాలక శాఖ సంచాలకుల పోస్టులకు అధికారులను నియమించాల్సి ఉంది. కొన్ని జిల్లాల్లో మూడేళ్లకు పైబడి కలెక్టర్లుగా కొనసాగుతున్న వారు ఉన్నారు. ఈసీ నిబంధనలకు లోబడి కొన్ని జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాల్సి ఉంది. కొందరు అధికారులు వెయిటింగ్​లో ఉన్నారు. వారికి కూడా పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగుల విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో ముగియనుండగా.. మధ్యప్రదేశ్ గడువు జనవరి 6, మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17, ఛత్తీస్‌గడ్ గడువు జనవరి 3, రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14తో పూర్తి కానుంది. దీంతో ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఈసీ అదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ విధుల్లో నేరుగా ఉండే అధికారులను సొంత జిల్లాల్లో.. ఎక్కువ కాలం పని చేసిన ప్రాంతాల్లో ఉండరాదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఒకేచోట మూడేళ్ల గడువు మించరాదని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి :

Telangana IAS Transfers 2023 : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ.. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగంలో ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేసింది. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌, ఆబ్కారీ శాఖకి కొత్త కమిషనర్లు వచ్చారు.

New Commissioner to GHMC : జీహెచ్ఎంసీకి కొత్త కమిషనర్ వచ్చారు. ప్రస్తుతం ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్న రొనాల్డ్ రోస్‌ను.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ కమిషనర్‌గా నియమించారు. ఇప్పటివరకు కమిషనర్‌గా ఉన్న లోకేష్ కుమార్‌ను... రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగణంగా లోకేష్ కుమార్‌ను బదిలీ చేసిన సర్కార్‌... ఆయన స్థానంలో బల్దియా బాధ్యతలను రొనాల్డ్ రోస్‌కు అప్పగించింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఉన్న... సర్ఫరాజ్ అహ్మద్‌ను రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా... ఈసీ నియమించింది. సర్ఫరాజ్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం... వెయిటింగ్‌లో ఉన్న ముషారఫ్ అలీ ఫారుఖీని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు...... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Officers Transfers in Telangana 2023 : త్వరలోనే ఆ 100 మంది అధికారుల బదిలీ..!

త్వరలోనే మరి కొంతమంది అధికారుల బదిలీలు : ఈ బదిలీలకు కొనసాగింపుగా మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఆర్థికశాఖ కార్యదర్శి, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి, పురపాలక శాఖ సంచాలకుల పోస్టులకు అధికారులను నియమించాల్సి ఉంది. కొన్ని జిల్లాల్లో మూడేళ్లకు పైబడి కలెక్టర్లుగా కొనసాగుతున్న వారు ఉన్నారు. ఈసీ నిబంధనలకు లోబడి కొన్ని జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాల్సి ఉంది. కొందరు అధికారులు వెయిటింగ్​లో ఉన్నారు. వారికి కూడా పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగుల విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో ముగియనుండగా.. మధ్యప్రదేశ్ గడువు జనవరి 6, మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17, ఛత్తీస్‌గడ్ గడువు జనవరి 3, రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14తో పూర్తి కానుంది. దీంతో ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఈసీ అదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ విధుల్లో నేరుగా ఉండే అధికారులను సొంత జిల్లాల్లో.. ఎక్కువ కాలం పని చేసిన ప్రాంతాల్లో ఉండరాదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఒకేచోట మూడేళ్ల గడువు మించరాదని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.