ETV Bharat / state

HighCourt Hearing on Teachers Transfers : టీచర్‌ను పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తామంటే ఎలా?: హైకోర్టు

author img

By

Published : Aug 14, 2023, 8:06 PM IST

Highcourt on teachers transfers
Telangana HighCourt latest news

HighCourt Hearing on Teachers Transfers : ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు విచారణ చేప్టటింది. ఏ ఆధారంతో వారిపై వివక్ష చూపుతున్నారని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉపాధ్యాయుడిని లేదంటే ఉపాధ్యాయురాలిని.. పెళ్లి చేసుకుంటేనే.. బదిలీ చేస్తామంటే ఎలాగని రాష్ట్ర సర్కార్​ని నిలదీసింది.

HighCourt Hearing on Teachers Transfers : బదిలీల్లో ఏ ప్రాతిపదికన ఉపాధ్యాయులను వేర్వేరుగా చూస్తున్నారని.. ప్రభుత్వాన్ని హైకోర్టు (HighCourt ) ప్రశ్నించింది. టీచర్‌ను పెళ్లి చేసుకుంటేనే ఉపాధ్యాయులను బదిలీ చేస్తారా అని వ్యాఖ్యానించింది. భార్యeభర్తలు ఒకేచోట ఉండాలనేది ఉద్దేశంతోనే ప్రత్యేక పాయింట్లు కేటాయించినట్లు ఉన్నత న్యాయస్థానానికి.. రాష్ట్ర సర్కార్ నివేదించింది. బదిలీలకు సంబంధించిన నిబంధనలను సవరించి ఈనెల 4న అసెంబ్లీ, 5న శాసనమండలి ముందుంచినట్లు తెలిపింది.

బదిలీల్లో ఉపాధ్యాయ దంపతులకు (Teachers Transfers) ప్రత్యేక పాయింట్లు కేటాయింపు వివాదానికి సంబంధించిన పిటిషన్లపై.. సీజే జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. బదిలీల నిబంధనల్లో ఇటీవల మార్పులు చేసి చట్టసభల ముందుంచినట్లు.. అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు మెమో సమర్పించారు. మెమో, కౌంటరు ఇవాళ ఇచ్చినందున వాదనలకు సమయం ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.

ఏదో ఓ కారణంతో పిటిషనర్లు కాలయాపన చేస్తున్నారని.. ఫిబ్రవరి 14 నుంచి స్టే ఉన్నందున బదిలీల ప్రక్రియ నిలిచి పోయినందున త్వరగా విచారణ జరపాలని అదనపు ఏజీ. న్యాయస్థానాన్ని కోరారు. విద్యా సంవత్సరం సగానికి వచ్చిందని.. ఎన్నికల కోడ్ సమీపిస్తోందని వివరించారు. ఈ క్రమంలోనే ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు టీచర్ల బదిలీలపై.. ఈనెల 23న తుది వాదనలు వింటామని వెల్లడించింది.

Highcourt on teachers transfers : ఉపాధ్యాయుల బదిలీలపై సోమవారం విచారణ

ఇటీవలే తెలంగాణ వ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్​ అసిస్టెంట్లు, ఎస్జీటీలు పదోన్నతులు, బదిలీలపై విద్యాశాఖ జనవరిలో జీవోను జారీ చేసింది. దీనికి తగినవిధంగా జనవరి 27 నుంచి మార్చి 19 వరకు ప్రక్రియ చేపట్టేలా షెడ్యూల్​ను రూపొందించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 73,803 మంది టీచర్లు దీనికి దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ బదిలీలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ.. నాన్ స్పౌజ్ టీచర్ల యూనియన్​ ధర్మాసనాన్ని ఆశ్రయించారు.

ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న దంపతులు ఒకే చోట ఉండేందుకు వీలుగా వారికి అదనపు పాయింట్లు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సౌకర్యం ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న దంపతులకు ఇవ్వాలి కదా అని పేర్కొన్నారు. మరోవైపు గవర్నర్​కు కనీసం సమాచారం లేకుండానే ఈ జీవో ఇవ్వడం విద్యా చట్టానికి విరుద్ధమని ఆ పిటిషన్​లో వివరించారు.

టీచర్ల బదిలీలపై ఏప్రిల్ 11 వరకు స్టే పొడిగించిన హైకోర్టు

నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి ఎన్నిక వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. 2019లో నాగం జనార్దన్​రెడ్డి వేసిన పిటిషన్‌పై ఈరోజు తీర్పు ఇచ్చింది. మర్రి జనార్దన్​రెడ్డి ఎన్నిక రద్దు చేయాలని నాగం జనార్దన్​రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2018 ఎన్నికల్లో నాగం జనార్దన్​రెడ్డిపై.. మర్రి జనార్దన్​రెడ్డి విజయం సాధించారు. అయితే ఈ క్రమంలోనే ఎన్నికల అఫిడవిట్‌లో మర్రి జనార్దన్ రెడ్డి కొన్ని వివరాలు దాచి పెట్టారని నాగం జనార్దన్​రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, పిటిషన్‌లో చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపలేదని పేర్కొంటూ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

High Court Hearing On EMail Petitions : మెయిల్​లో వచ్చిన ఫిర్యాదులను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.