ETV Bharat / state

ప్రభుత్వ లెక్కలపై హైకోర్టు అసంతృప్తి-  విచారణ నవంబర్​1కి వాయిదా

author img

By

Published : Oct 29, 2019, 11:09 PM IST

ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లెక్కలు తప్పుదోవపట్టించేలా ఉన్నాయని పేర్కొంది. ఒక్క హుజూర్​నగర్​కు రూ.100 కోట్లు కేటాయించిన సర్కారు... రాష్ట్ర ప్రజలందరి కోసం రూ.47 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఇచ్చామని చూపిస్తున్న లెక్కలన్నీ నిజమా.. కాదా... అనే పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను నవంబరు 1కి వాయిదా వేసింది.

HIGH COURT UNSATISFIED IN TELANGANA GOVERNMENT TSRTC PAYMENTS REPORT

ప్రభుత్వ లెక్కలపై హైకోర్టు అసంతృప్తి- విచారణ నవంబర్​1కి వాయిదా

ఆర్టీసీ సమ్మెపై సోమవారం నాటి విచారణను కొనసాగించిన హైకోర్టు... ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 నుంచి 14 వరకు రీఎంబర్స్ మెంట్ బకాయిలు రూ.1099 కోట్లు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. 2014 తర్వాత ఆర్టీసీకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామని తెలిపింది. బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో రూ.125 కోట్లు మాత్రమే ఇక ఇవ్వాల్సి ఉందంది. 2020 మార్చి నాటికి మొత్తం బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది.

బకాయిలు చెల్లించారా...?

ఇప్పటి వరకు ఆర్టీసీకి రూ. 4వేల 253 కోట్లు ఇచ్చామని ప్రభుత్వం చెప్పింది. దీనిపై కలుగజేసుకున్న ధర్మాసనం రూ.4 వేల కోట్లు ఇస్తే... మిగిలిన బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదా అని నిలదీసింది. బ్యాంకు గ్యారెంటీగా ఇచ్చిన రూ.850 కోట్లను కూడా ఇచ్చామని చెప్పటంపై హైకోర్టు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఉద్దేశ పూర్వకంగా, అస్పష్టంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నివేదిక సమర్పించారని... తప్పుదోవ పట్టించేలా లెక్కలున్నాయని ధర్మాసనం పేర్కొంది.

హజూర్​నగర్​కు రూ.100 కోట్లు ఇచ్చారుగా...

మరోవైపు తక్షణ సమస్యల పరిష్కారం కోసం అడిగిన రూ.47 కోట్లు వెంటనే ఇవ్వలేమన్న ప్రభుత్వ వివరణపైన హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఉప ఎన్నిక జరిగిన పట్టణానికి రూ.100 కోట్లు ఇచ్చినప్పుడు.. రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనాల కోసం రూ.47 కోట్లు ఇవ్వలేరా? అని సూటిగా ప్రశ్నించింది. ఒక పట్టణ ప్రజలు ముఖ్యమా? రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమా... అని నిలదీసింది.

ఉద్యోగాలు పోవాలని కోరుకుంటున్నారా...?

సమ్మె విరమించేలా ఆదేశించాలన్న పిటిషనర్‌ తరపు న్యాయవాది విజ్ఞప్తిని తప్పుపట్టిన కోర్టు... సమ్మె చట్ట విరుద్ధమని మేం ప్రకటిస్తే... కార్మికుల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందని వ్యాఖ్యానించింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటిస్తే...చట్ట పరంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలుసా? అని పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు...వేల మంది కార్మికుల ఉద్యోగాలు పోవాలని కోరుకుంటున్నారా అని పేర్కొంది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేసింది.

లెక్కలు నిజమో కాదో తేల్చాలి...

విచారణ సందర్భంగా సమ్మెకు సంబంధించిన అన్ని అంశాలను ప్రస్తావించిన హైకోర్టు...ప్రభుత్వం చెబుతున్న లెక్కలపై నివేదిక సమర్పించాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. ప్రభుత్వం రూ.4 వేల 243 కోట్లు ఇచ్చిందా లేదా... ఒకవేళ ఇస్తే అందులో రీఎంబర్స్​మెంట్ బకాయిల చెల్లింపులు కూడా ఉన్నాయా లేదా తెలపాలని స్పష్టం చేసింది. జీహెచ్​ఎంసీ రూ. 335 కోట్లు చెల్లించింది నిజమేనా కాదో నివేదికలో వివరించాలని ఆదేశించింది. ఈనెల 31లోగా నివేదిక సమర్పించాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం... తదుపరి విచారణను నవంబరు 1వ తేదీకి వాయిదా వేసింది. ఆర్టీసీలో ఆర్థిక వ్యవహారాలు చూసే అధికారిని ఆ రోజున హైకోర్టుకు పంపించాలని ఆదేశించింది.

ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని​ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

TG_HYD_61_29_HC_ON_RTC_STRIKE_PKG_3064645 REPORTER: NAGESHWARA CHARY ( ) ఆర్టీసీకి 47 కోట్ల రూపాయలు ఇప్పటికిప్పుుడు ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిల కన్నా ఎక్కువే ఇచ్చామని నివేదించింది. ప్రభుత్వ నివేదికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం... అంకెలు తప్పుదోవపట్టించేలా ఉన్నాయని పేర్కొంది. ఉపఎన్నిక జరిగిన ఒక్క నియోజకవర్గానికి 100 కోట్లు కేటాయించిన సర్కారు... రాష్ట్ర ప్రజలందరి కోసం ఎందుకు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించింది. సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలన్న పిటిషనర్ అభ్యర్థనను నిరాకరించింది ప్రభుత్వం 4 వేల 243 కోట్ల రూపాయలు... జీహెచ్ఎంసీ 335 కోట్ల రూపాయలు ఇచ్చిందా లేదా... అనే పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను నవంబరు 1కి వాయిదా వేసింది. look వాయిస్ ఓవర్: ఆర్టీసీకి సత్వరమే 47 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిచలేదని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. బడ్జెట్ లో ఆర్టీసీకి కేటాయింటిన 550 కోట్ల రూపాయల్లో.. 125 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని... వాటిని ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు విడుదల చేస్తామని సర్కారు నివేదించింది. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రీఎంబర్స్ మెంట్ కు సంబంధించిన 1099 కోట్ల బకాయిలు ఉన్నాయని... అయితే 9వ షెడ్యూలులో ఉన్న ఆర్టీసీ ఆస్తులు, అప్పుల విభజన అంశం తేలలేదని... కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని సర్కారు నివేదించింది. మరోవైపు ఐదేళ్లలో ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలకన్నా ఎక్కువగానే ఇచ్చిందని పేర్కొంది. ఐదేళ్లలో ఆర్టీసీకి 4 వేల 253 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వివరించింది. జీహెచ్ఎంసీ 335 కోట్ల రూపాయల బకాయిలను ఆర్టీసీకి చెల్లించిందని తెలిపింది. బైట్: పీవీ కృష్ణయ్య, పిటిషనర్ తరఫు న్యాయవాది వాయిస్ ఓవర్: ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నివేదికపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డి ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము అడిగిన వివరాలను సరిగా పరిశీలించకుండానే నివేదిక సమర్పించారని పేర్కొంది. కోర్టుకు నివేదికలు సమర్పించేటప్పుడు అధికారులు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు ఎంత ఇచ్చారని తాము అడగలేదని... చెల్లించాల్సిన బకాయిల వివరాలను అడిగామని పేర్కొంది. ప్రభుత్వం 4 వేల 253 కోట్లు ఇస్తే.. బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదా ప్రశ్నించింది. ప్రభుత్వ లెక్కలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. బ్యాంకులకు గ్యారంటీగా చూపిన 850 కోట్ల రూపాయలను... ఆర్టీసీకి ఇచ్చినట్లు ఎలా అవుతుందని సూటిగా ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ 335 కోట్లు చెల్లించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. ఉపఎన్నిక జరిగిన ఒక్క నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం.. రాష్ట్ర ప్రజలందరి కోసం ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. అడిగే అధికారం న్యాయ వ్యవస్థకు లేకపోయినప్పటికీ... పది లక్షల మంది కోసం 100 కోట్లు ఇచ్చి.. రాష్ట్ర ప్రజలందరి కోసం ఇవ్వకపోవడాన్ని ఎలా సమర్థించుకుంటారని వ్యాఖ్యానించింది. ఆర్టీసీ విభజన అంశం ఐదేళ్లుగా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. ఇటీవలే కేంద్రానికి లేఖ రాసినట్లు అడ్వొకేట్ జనరల్ హైకోర్టు తెలిపారు. బైట్: పీవీ కృష్ణయ్య, పిటిషనర్ తరఫు న్యాయవాది వాయిస్ ఓవర్: ఆర్టీసీ కార్మికుల సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. చట్ట విరుద్ధమని తాము ప్రకటిస్తే చట్ట పరంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఆలోచిస్తున్నారా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వేల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి... రోడ్డున పడాలని కోరుకుంటున్నారా అని పేర్కొంది. అలా జరగకూడదన్న ఉద్దేశంతోనే... మధ్యేమార్గంగా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని హైకోర్టు తెలిపింది. ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధర్మాసనం పేర్కొంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతూనే ఉన్నప్పటికీ... ఇప్పటికీ మూడో వంతు బస్సులు నడవడం లేదని హైకోర్టు పేర్కొంది. బైట్: పీవీ కృష్ణయ్య, పిటిషనర్ తరఫు న్యాయవాది వాయిస్ ఓవర్: ప్రభుత్వం చెబుతున్న లెక్కలపై నివేదిక సమర్పించాలని ఆర్టీసీ ఎండీని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం 4 వేల 243 కోట్ల రూపాయలు ఇచ్చిందా లేదా... ఒకవేళ ఇస్తే అందులో రీఎంబర్స్ మెంట్ బకాయిల చెల్లింపులు కూడా ఉన్నాయా లేదా తెలపాలని ఆర్టీసీ ఎండీకి స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ 335 కోట్ల రూపాయలు చెల్లించింది నిజమేనా కాదో నివేదికలో వివరించాలని ఆదేశించింది. ఈనెల 31లోగా నివేదిక సమర్పించాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం... తదుపరి విచారణను నవంబరు 1వ తేదీకి వాయిదా వేసింది. ఆర్టీసీలో ఆర్థిక వ్యవహారాలు చూసే అధికారిని ఆ రోజున హైకోర్టుకు పంపించాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. END
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.