ETV Bharat / state

సుర్రుమంటున్న సూరీడు.. ఈరోజు గరిష్ఠం 45.7 డిగ్రీలు..!

author img

By

Published : Apr 27, 2022, 5:15 PM IST

సుర్రుమంటున్న సూరీడు.. అత్యధికంగా 45.7 డిగ్రీలు..!
సుర్రుమంటున్న సూరీడు.. అత్యధికంగా 45.7 డిగ్రీలు..!

రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వడగాల్పుల భయంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పగటిపూటే కాదు రాత్రి ఉష్ణోగ్రతలూ అసాధారణంగా పెరుగుతున్నాయి.

రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచే భగ్గుమంటున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే.. నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా.. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. తాజాగా ఆదిలాబాద్​ జిల్లా జైనథ్​లో అత్యధికంగా 45.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

ఆదిలాబాద్​ జిల్లాలోని చప్రాలలో 45.6 డిగ్రీలు, భోరాజ్​లో 45.3 డిగ్రీలు, జగిత్యాల​ జిల్లాలోని ఐలాపూర్​​లో 45.1, గోవిందారంలో 45 డిగ్రీలు, నిర్మల్​ జిల్లా బాసరలో 44.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు
రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

ఇవీ చూడండి..

'ఏపీ అభ్యంతరాలను జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌ తిరస్కరించారు'

చిరు లీక్స్.. 'భవదీయుడు' సినిమాలోని డైలాగ్ చెప్పేసిన మెగాస్టార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.