ETV Bharat / state

Harish Tweet On Rahul : 'ఆ ఒక్క ప్రశ్నతో రాహుల్ గాంధీ సంగతేంటో అర్థమైంది'

author img

By

Published : May 7, 2022, 11:49 AM IST

Harish Tweet On Rahul
హరీశ్ రావు

Harish Tweet On Rahul: రాహుల్ గాంధీ పర్యటనపై ఆర్థికశాఖ మంత్రి సెటైర్లు వేశారు. తెలంగాణ రైతుల పట్ల ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో విమానాశ్రయంలో దిగగానే అర్థమైందని ఎద్దేవా చేశారు. పంజాబ్​లో కాంగ్రెస్​ను రైతులే ఈడ్చి తన్నారని ట్విటర్ ద్వారా విమర్శించారు.

Harish Tweet On Rahul: తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో విమానాశ్రయంలో దిగగానే అర్థమైందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి ట్విటర్ ద్వారా సెటైర్లు వేశారు. పంజాబ్ రైతులు నమ్మని డిక్లరేషన్​.. చైతన్యమున్న తెలంగాణ రైతులు నమ్ముతారా? అని ప్రశ్నించారు. వరంగల్​లో జరిగింది రైతు సంఘర్షణ సభ కాదని.. రాహుల్ సంఘర్షణ సభ అని ఎద్దేవా చేశారు.

  • ఎయిర్ పోర్టులో దిగి ఇవ్వాల ఏం మాట్లాడాలి, సభ దేని గురించి అని అడిగిన @RahulGandhi గారికి తెలంగాణ రైతుల గురించి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. ఎప్పటికీ తెలంగాణలోని సబ్బండ వర్గాల సంక్షేమం గురించి నిరంతరం పనిచేసే ఏకైక పార్టీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ మాత్రమే.
    2/2

    — Harish Rao Thanneeru (@trsharish) May 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతులే కాంగ్రెస్​ను ఈడ్చి తన్నారని హరీశ్ రావు అన్నారు. విమానాశ్రయంలో దిగిన తర్వాత ఏం మాట్లాడాలి.. సభ దేని గురించి అని అడిగిన రాహుల్ గాంధీకి తెలంగాణ రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే ఏకైక పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెరాస మాత్రమేనని హరీశ్​ రావు ట్వీట్ చేశారు.

ఇవీ చూడండి: ఇంటర్‌ పరీక్షలకు 22,210 మంది గైర్హాజరు.. సిద్దిపేటలోనే అధికం..!

రెండంతస్తుల భవనంలో మంటలు.. ఏడుగురు సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.