ETV Bharat / state

Harish Rao Latest Comments : వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 సీట్లు గెలుస్తుంది: హరీశ్​రావు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2023, 7:29 PM IST

Harish Rao Latest Comments on Congress : కాంగ్రెస్​ పార్టీ ప్రకటించే డిక్లరేషన్లు అమలు అవ్వవని.. కర్ణాటకలో ఇచ్చిన హామీల్లో ఒకటి నెరవేర్చలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న 14 సీట్లు బీఆర్​ఎస్​ గెలుస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ భవన్​లో ఆయన సమక్షంలో కొంత మంది నాయకులు బీఆర్​ఎస్​ తీర్థం పుచ్చుకున్నారు.

Harish Fire on Congress Party
Harish Rao Latest Speech

Harish Rao Speech తెలంగాణలో మూడోసారి బీఆర్​ఎస్​ వస్తుందన్న మంత్రి హరీశ్​రావు

Harish Rao Latest Comments on Congress Leaders : కాంగ్రెస్ పార్టీ ఇచ్చేవన్నీ ఉత్తుత్తి డిక్లరేషన్లు.. కర్ణాటకలో ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు. దళితులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తుందని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో బీఆర్​ఎస్​లో చేరిన పీసీసీ ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్‌రావుకు మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి అభిలాష్​రావు అనుచరులు, శ్రేణులు భారీగా తరలివచ్చారు. గత రెండు ఎన్నికల్లో కూడా మ్యానిఫెస్టోలో చెప్పినవి, చెప్పనవి అన్నీ ప్రభుత్వం చేసిందని తెలిపారు. కేసీఆర్(KCR) నాయకత్వంలో రైతుబంధు‌, రైతుబీమా, రుణమాఫీ సహా వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని తెలిపారు.

BRS Joinings in Telangana : రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లి అడిగినా బీఆర్​ఎస్​ సర్కార్.. కేసీఆర్ హాట్రిక్ కొట్టబోతున్నారని జోస్యం చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన అభిలాష్ రావు.. కాంగ్రెస్‌లో పనిచేసినా ఇప్పుడు బీఆర్​ఎస్​లో చేరుతున్నారని, భవిష్యత్తులో ఆయనకు పార్టీ ఉన్నత స్థానం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఒక్క పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఐదు వైద్య కళాశాలలు వచ్చాయని.. కల్వకుర్తికి వంద పడకల ఆసుపత్రి వచ్చిందంటే సీఎం కేసీఆర్ వల్లేనని స్పష్టం చేశారు. త్వరలో పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభం కాబోతోందని ప్రకటించారు.

Harish Rao Comments on Congress Party : 'కాంగ్రెస్‌ ఎస్సీలపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడితే అది మొసలి ప్రేమే'

Telangana Assembly Elections : ఈసారి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 సీట్లు బీఆర్​ఎస్​ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో పాలమూరు జిల్లా అభివృద్ధి చెందిందని అన్నారు. మరోవైపు, తెలంగాణలో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రప్రదేశ్‌లో వంద ఎకరాలు వస్తాయన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu) వ్యాఖ్యలను గుర్తు చేశారు. కేసీఆర్ సర్కారు అన్నదాతకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, పర్యాటక సంస్థ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, క్రీడా సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

"గిరిజనుల వెనుకబాటుకు కారణం కాంగ్రెస్‌ పార్టీ. బీఆర్‌ అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ ఓడించింది. జగ్జీవన్‌రామ్‌ ప్రధాని కాకుండా అడ్డుకున్నది. కాంగ్రెస్‌కు ఎస్సీలపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడితే అది మొసలి ప్రేమే అవుతోంది.కేసీఆర్​ ప్రభుత్వం గిరిజనుల కోసం తండాలను పంచాయతీలుగా మార్చింది. వారికి పది శాతం రిజర్వేషన్లు అమలు చేశాం. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల విద్యుత్‌ వస్తోంది. ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేసింది కాంగ్రెస్​. కేసీఆర్‌ నాయకత్వంలో పాలమూరు జిల్లా అభివృద్ది చెందింది. తెలంగాణ తరహా పథకాలు దేశానికి మార్గదర్శకంగా ఉన్నాయి. కేసీఆర్‌ నాయకత్వాన్ని బలోపేతం చేయాలి."- హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి

Harish Rao on 2023 Assembly Elections : 'రాష్ట్రానికి స్ట్రాంగ్​ లీడర్​ కావాలో.. రాంగ్​ లీడర్​ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలి'

Harish Rao Telangana Elections 2023 : 'ఉమ్మడి మెదక్ జిల్లాలో 10స్థానాలు గెలిచి.. కేసీఆర్​కు కానుక ఇస్తా'

Harish Rao on Rythu Bhima Scheme : రైతు పక్షపాతి కేసీఆర్.. రైతు బీమాకు ఐదేళ్లు పూర్తి​ : హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.