ETV Bharat / state

నిరాడంబరంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

author img

By

Published : Jun 4, 2021, 9:46 PM IST

రాష్ట్రంలో కరోనా విజృంభణ, లాక్​డౌన్​ వల్ల హనుమాన్​ జయంతి వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్​, బంజారాహిల్స్​లోని స్వర్ణ దేవాలయంలో కొంతమంది సమక్షంలోనే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు.

hanuman jayanthi vedukalu
hanuman jayanthi vedukalu

హైదరాబాద్​, బంజారాహిల్స్​లోని స్వర్ణ దేవాలయంలో హనుమాన్‌ జయంతి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఆధ్వర్యంలో కరోనా విజృంభణ దృష్ట్యా.. ఈ సారి వేడుకలను అంతర్గతంగా జరిపారు.

ఆలయ అర్చకులు ఆంజనేయుడి విగ్రహాన్ని అందంగా అలంకరించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభుజీ హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి: KCR: పర్యావరణ పరిరక్షణను మించిన సంపదే లేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.