ETV Bharat / state

కరోనా వేళ మహిళల సేవలు, ధైర్య సాహసాలకు సెల్యూట్: గవర్నర్ తమిళిసై

author img

By

Published : Mar 7, 2021, 7:36 PM IST

governor-tamilisai-wishes-to-all-state-women-on-the-occasion-of-international-womens-day
కరోనా సమయంలో మహిళల ధైర్యసాహసాలకు సెల్యూట్: గవర్నర్ తమిళిసై

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో సమానత్వం సాధించాలని ఆకాంక్షించారు. కరోనా సమయంలో మహిళల సేవలు, చూపించిన ధైర్యసాహసాలకు సెల్యూట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

కుటుంబ సంరక్షణ మొదలుకొని దేశ నిర్మాణం వరకు అన్నింట్లో మహిళలు సర్వశక్తిమంతులని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. కొవిడ్ -19 సమయంలో మహిళలు సంరక్షకులుగా, ఫ్రంట్‌లైన్ యోధులుగా చూపించిన త్యాగం, ధైర్యసాహసాలకు తాను సెల్యూట్ చేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర మహిళలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 2021 అంతర్జాతీయ థీమ్- మహిళల నాయకత్వమని... అన్ని రంగాల్లో మహిళలు సమానత్వం సాధించాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటే పెళ్లే వద్దనుకున్నా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.