బదిలీలపై ఉపాధ్యాయ దంపతుల ఆందోళన.. 50 మంది అరెస్ట్​

author img

By

Published : Jan 12, 2022, 4:55 PM IST

Updated : Jan 12, 2022, 5:17 PM IST

Pragathi Bhavan Muttadi

Protests at Pragathi Bhavan: ప్రగతి భవన్​ ఎదుట కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బదిలీల్లో భార్యాభర్తలకు ఒకే చోట పోస్టింగ్​ ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. అడ్డుకున్న పోలీసులు.. 50 మంది టీచర్లను అరెస్టు చేశారు.

Protests at Pragathi Bhavan: బదిలీల్లో దంపతులకు ఒకేచోట పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ప్రగతిభవన్ ఎదుట నిరసన చేపట్టారు. జీవో 317 కింద చేపట్టిన బదిలీల్లో భార్యాభర్తలను పరిగణనలోకి తీసుకుని ఒకేచోట పోస్టింగ్​ ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ ప్రగతి భవన్​ ముట్టడికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన చేస్తున్న 50 మంది టీచర్లను అరెస్టు చేశారు.

దూరం పంపించొద్దు

ప్రగతి భవన్​ ఎదుట ఉపాధ్యాయులు

'మేమంతా అంతర్​ జిల్లా బాధితులం. 317 జీవో వల్ల భార్యాభర్తలను వేరే వేరే జిల్లాలకు బదిలీలు చేశారు. ఈ జీవో కారణంగా వేర్వేరు జిల్లాలకు బదిలీలు ఇవ్వడంతో మానసిక క్షోభకు గురవుతున్నాం. 19 జిల్లాల ఉపాధ్యాయ దంపతులను ఒకే చోట వేశారు. మా 13 జిల్లాలను బ్లాక్​ లిస్టులో పెట్టారు. మేము ఇక్కడికి గొడవ చేయాలని రాలేదు. మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాం.'-బాధిత ఉపాధ్యాయ దంపతులు

రాష్ట్రంలోని 19 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ భార్యాభర్తలకు ఒకేచోట పోస్టింగ్ ఇచ్చారని.. మిగతా 13జిల్లాలకు చెందిన తమకు వేర్వేరుచోట్ల కేటాయించారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. వేర్వేరు జిల్లాలకు కేటాయించడంతో 150- 200 కి.మీల దూరంలో దంపతులను విభజించారని వాపోయారు. ముఖ్యమంత్రి సత్వరమే నిర్ణయం తీసుకోవాలని 13జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: జీహెచ్ఎంసీ జోనల్​ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. పలు దస్త్రాలు దగ్ధం

Last Updated :Jan 12, 2022, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.