ETV Bharat / state

'విదేశీయుల్లా ఉన్నారని సరుకులు ఇవ్వలేదు'

author img

By

Published : Apr 10, 2020, 8:33 PM IST

మణిపూర్​కు చెందిన ఇద్దరు వ్యక్తులు విదేశీయులను పోలి ఉన్నారని ఓ సూపర్​ మార్కెట్​ సిబ్బంది వారిని లోపలికి అనుమతించని ఘటన హైదరాబాద్​ వనస్థలిపురంలో చోటుచేసుకుంది.

'విదేశీయుల్లా ఉన్నారని సరుకులు ఇవ్వలేదు'
'విదేశీయుల్లా ఉన్నారని సరుకులు ఇవ్వలేదు'

మార్కెట్​లో నిత్యావసరాలను కొనడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు విదేశీయులను పోలినట్లు ఉన్నారని.. వారని సూపర్​ మార్కెట్​లోకి అనుమతించని ఘటన హైదరాబాద్​ వనస్థలిపురంలో చోటుచేసుకుంది. వనస్థలిపురంలోని స్టార్ సూపర్ మార్కెట్​లో సరుకులు కొనడానికి మణిపూర్​కు చెందిన ఇద్దరు వ్యక్తులు వచ్చారు. విదేశీయులను పోలినట్లు ఉన్నారని సూపర్ మార్కెట్​ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని, స్టోర్ కీపర్​ను అరెస్టు చేశారు. బాధితులు సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్​ భగవత్ విద్యార్థులకు ఒక నెలకు సరిపోయే నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.