ETV Bharat / state

'విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్​ చేయాలి'

author img

By

Published : Apr 29, 2019, 5:15 PM IST

గీతారెడ్డి

ఇంటర్​ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్​ సీనియర్​ నాయకురాలు గీతారెడ్డి ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు నెట్టివేయడం దారుణమన్నారు.

ఇంటర్​ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విద్యాశాఖ మంత్రి జగదీష్​రెడ్డిని బర్తరఫ్​ చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నాయకురాలు గీతారెడ్డి డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. గ్లోబరీనా సంస్థకు సామర్థ్యం లేదని గతంలోనే కడియం శ్రీహరి కమిటీ తేల్చిందని గుర్తు చేశారు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చనిపోయిన పిల్లల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు.

తెరాస ప్రభుత్వానిది అప్రజాస్వామికమన్న గీతారెడ్డి

ఇదీ చదవండి : 'పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లినా లక్ష్మణ్​ దీక్ష ఆగదు'

Intro:Hyd_tg_24_29_congress_anjan_kumar_yadav_arrest_ab_c18.
md sulthan 9394450285.
ఇంటర్ మీడియట్ విద్యార్థుల బలిదనాలకు కు నిరసనగా
అఖిల పక్షం ఆధ్వర్యంలో ఇంటర్ మిడియట్ బోర్డ్ ముట్టడి కి బయలు దేరుతున్న కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీ గొల్ల ఖిడికి లోని కాంగ్రెస్ సకింద్రబాద్ x ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఆయన కొడుకు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ల నివాసం నుండి బయటకు రాగానే అరెస్ట్ చేసిన హుస్సేని అలం పోలీసులు, ఇరువురిని హుస్సేని అలం ps కు తరలించారు.

బైట్.. అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ సికింద్రాబాద్.
అనిల్ కుమార్ యాదవ్ , యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు....


Body:గొల్ల ఖిడికి


Conclusion:హైదరాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.