కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లతో తెలంగాణ భవన్ సందడిగా మారింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, తదితర జిల్లాల నుంచి మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కలిసేందుకు భారీగా తరలివచ్చారు. మంత్రి కేటీఆర్ను కలిసి తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలర్లకు అభినందనలు తెలిపిన కేటీఆర్... ప్రతీ ఒక్కరితో ఫోటోలు దిగారు. కొత్త మున్సిపల్ చట్టంపై అవగాహన పెంచుకోవాలని.. ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా పని చేయాలని కేటీఆర్ వారికి సూచించారు.
ఇవీ చూడండి: త్వరలో ఫ్యాన్సీ నంబర్లకు ఇ-బిడ్డింగ్