హైదరాబాద్ వాసులకు ఉచితంగా ఛాయ్, బిస్కెట్ అందించేందుకు డాక్టర్ రబీందర్నాథ్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఫ్రీ ఛాయ్, ఫ్రీ బిస్కెట్ పేరుతో కేంద్రాన్ని ప్రారంభించింది. ఉచితంగా ఛాయ్, బిస్కెట్తో పాటు టాయిలెట్ సదుపాయం సైతం ఏర్పాటు చేసింది.
బసవతారక క్యాన్సర్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే వారికి ఉచితంగా ఛాయ్, బిస్కెట్లు అందిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉచితంగా ఛాయ్, బిస్కెట్తో పాటు టాయిలెట్ వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి: జుట్టు రాలడం, చుండ్రు బాధిస్తున్నాయా?... అయితే ఇలా చేయండి!