ETV Bharat / state

భాగ్యనగర వాసులకు ఉచిత ఛాయ్, బిస్కెట్!

author img

By

Published : Mar 16, 2021, 11:06 AM IST

భాగ్యనగర వాసులకు ఫ్రీ ఛాయ్, బిస్కెట్​ను అందించనున్నట్లు రబీందర్​నాథ్ ఫౌండేషన్ ప్రకటించింది. అందుకు సంబంధించిన కేంద్రాన్ని బంజారాహిల్స్​లో ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉచితంగా ఛాయ్‌, బిస్కెట్‌తో పాటు టాయిలెట్‌ వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

free-chai-and-biscuit-distribution-to-hyderabad-people
భాగ్యనగర వాసులకు ఉచిత ఛాయ్, బిస్కెట్!

హైదరాబాద్‌ వాసులకు ఉచితంగా ఛాయ్, బిస్కెట్‌ అందించేందుకు డాక్టర్‌ రబీందర్‌నాథ్‌ ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఫ్రీ ఛాయ్‌, ఫ్రీ బిస్కెట్‌ పేరుతో కేంద్రాన్ని ప్రారంభించింది. ఉచితంగా ఛాయ్‌, బిస్కెట్‌తో పాటు టాయిలెట్‌ సదుపాయం సైతం ఏర్పాటు చేసింది.

బసవతారక క్యాన్సర్‌ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే వారికి ఉచితంగా ఛాయ్‌, బిస్కెట్లు అందిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉచితంగా ఛాయ్‌, బిస్కెట్‌తో పాటు టాయిలెట్‌ వినియోగించుకోవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి: జుట్టు రాలడం, చుండ్రు బాధిస్తున్నాయా?... అయితే ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.