ETV Bharat / state

Etela on mlc elections: 'కరీంనగర్​లో తెరాస ఓ స్థానం ఓడిపోవడం ఖాయం'

author img

By

Published : Nov 26, 2021, 5:37 PM IST

గెలుపోటములు పక్కన పెట్టి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే కేసీఆర్​కు భయమైనా ఉండేదని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela rajender on mlc elections) అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ పోరులో కరీంనగర్​లోని ఒక స్థానంలో తెరాస ఓడిపోతుందన్నారు. కేసీఆర్​ మాటలను ప్రజలు నమ్మడం లేదని.. భవిష్యత్తులో రాష్ట్రంలో తెరాస ఉండబోదని భాజపా నేత విజయశాంతి జోస్యం చెప్పారు. మీడియాతో నిర్వహించిన చిట్​చాట్​లో కేసీఆర్​పై ఈటల, విజయశాంతి విమర్శలు గుప్పించారు.

etela rajender, vijaya shanthi
ఈటల రాజేందర్​, విజయశాంతి

Etela rajender on mlc elections: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు ఏకగ్రీవం అవకాశం ఇవ్వొద్దని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(etela chit chat with media) విజ్ఞప్తి చేశారు. కరీంనగర్​లో ఒక స్థానంలో తెరాస ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ మేరకు మీడియాతో నిర్వహించిన చిట్​చాట్​లో ఈటల, విజయశాంతి.. సీఎం కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆదిలాబాద్ నుంచి తానే ఒకరిని పోటీకి దింపినట్లు ఈటల తెలిపారు. ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తాయి.. గెలుస్తామా, ఓడుతామా అనేది పక్కన పెడితే పోటీ చేయాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేస్తే కేసీఆర్​కు కనీసం భయమైనా ఉండేదని అభిప్రాయపడ్డారు.

కేసీఆర్​పై నమ్మకం పోయింది

ముఖ్యమంత్రి పీఠం కోసం కేసీఆర్ కుటుంబంలో యుద్ధం మొదలైందని మాజీ ఎంపీ, భాజపా నేత విజయశాంతి(vijayashanthi chit chat with media) అన్నారు. ప్రగతి భవన్​లో కుస్తీ ఫైటింగ్ జరుగుతోందన్న ఆమె.. కుటుంబ పంచాయితీతో కేసీఆర్ తల పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో భవిష్యత్తులో తెరాస ఉండదని జోస్యం చెప్పారు. కేసీఆర్ మోసపూరిత విధానాలు అవలంభిస్తున్నారని.. ఆయన మాటలను ఎవరూ నమ్మడం లేదని చిట్​చాట్​లో విజయశాంతి అన్నారు.

వాళ్లు టచ్​లో ఉన్నారు

కుటుంబ కొట్లాటల నుంచి ఉపశమనం పొందేందుకే కేసీఆర్​ దిల్లీ పర్యటనకు వెళ్లారని విజయశాంతి(vijaya shanthi comments on kcr) ఎద్దేవా చేశారు. కేసీఆర్ గురించి పీహెచ్​డీ చేశానన్న ఆమె.. ఆయన​ ప్రజలకు ఏం చెప్తారో అదే చేయరని విమర్శించారు. తెరాస, కాంగ్రెస్, ఎంఐఎం మూడూ ఒకటేనని.. అవసరాల కోసమే కాంగ్రెస్​ పార్టీని కేసీఆర్​ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో తెరాసకు తక్కువ సీట్లు పడితే.. అప్పుడు హస్తం పార్టీ సీట్లు వాడుకుంటారని ఆరోపించారు. తాను ఎక్కడ పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు.​ కేసీఆర్​పై కచ్చితంగా విచారణ ఉంటుందన్న ఆమె.. ఇతర పార్టీలకు చెందిన నేతలు తమకు టచ్​లో ఉన్నారని చెప్పారు.

ఇదీ చదవండి: BJP Tarun chugh comments: 'కాంగ్రెస్, తెరాస నుంచి పాతికమంది నేతలు టచ్‌లో ఉన్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.