ETV Bharat / state

పదోన్నతులు కల్పించాలని మంత్రి సబితకు వినతి

author img

By

Published : Feb 4, 2021, 9:29 AM IST

employees jac meet
'ఉపాధ్యాయులకు తక్షణమే పదోన్నతులు ఇవ్వాలి'

ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని... విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి జాక్టో, యూఎస్​పీసీ ప్రతినిధులు వినతి సమర్పించారు. జనవరి నెలాఖరులోగా అన్ని శాఖల్లో పదోన్నతులు ఇవ్వాలంటూ... ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు విద్యాశాఖలో అమలు కాలేదని తెలిపారు.

ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని జాక్టో, యూఎస్​పీసీ ప్రతినిధులు కోరారు. తక్షణమే పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం సమర్పించారు. ఐదున్నరేళ్ళుగా పదోన్నతులు లేక ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. పాత జిల్లాల ప్రాతిపదికన ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు ఇవ్వటంలో జాప్యం జరుగుతోందన్నారు.

వివాదాలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా పదోన్నతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని... అందుకనుగుణంగానే షెడ్యూలు రూపొందించామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మరోసారి సీఎంతో మాట్లాడి పదోన్నతుల షెడ్యూల్ వీలైనంత త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో జి. సదానందంగౌడ్, కె. జంగయ్య, చావ రవి, కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి: హైకోర్టును ఆశ్రయించిన నిజాం వారసురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.