ETV Bharat / state

బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్‌

author img

By

Published : Dec 8, 2022, 5:57 PM IST

Updated : Dec 8, 2022, 7:26 PM IST

brs
brs

17:52 December 08

భారత్​ రాష్ట్ర సమితిగా పేరు మారుస్తూ ఈసీ నిర్ణయం

BRS
టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ ఈసీ నిర్ణయం

దేశంలో తెలంగాణ తరహా పాలన తీసుకుచ్చేందుకు తెలంగాణ రాష్డ్ర సమితిని... భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చేందుకు కేసీఆర్‌ చేపట్టిన ప్రయత్నాల్లో తొలి అడుగు పడింది. టీఆర్​ఎస్​ను బీఆర్​ఎస్​గా గుర్తిస్తున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు బీఆర్​ఎస్ పేరు మార్పుపై ఈసీ నుంచి కేసీఆర్‌కు అధికారికంగా లేఖ అందింది. అక్టోబర్ 5న దసరా రోజున పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం మేరకు తెరాసను భారాసగా మారుస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసీ లేఖకు స్పందనగా ఎన్నికల సంఘానికి గులాబీదళపతి కేసీఆర్‌ లేఖ పంపనున్నారు.

రేపు మధ్యాహ్నం బీఆర్​ఎస్ ఆవిర్భావ కార్యక్రమం : రేపు తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకు బీఆర్​ఎస్ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. అనంతరం బీఆర్​ఎస్ జెండాను ఆవిష్కరించనున్నారు. ఆ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొనాలని పార్టీ నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. బీఆర్​ఎస్​గా పేరుమార్పు ప్రక్రియ పూర్తికావడంపై తదుపరి కార్యాచరణపై గులాబీదళపతి నిర్ణయం తీసుకోనున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా లేఖ రావడంతో దిల్లీ నుంచి టీఆర్​ఎస్ ఎంపీలు హైదారాబాద్‌ బయలుదేరారు. వెంటనే రావాలని సీఎంవో నుంచి ఆదేశాలు రావడంతో టీఆర్​ఎస్ ఎంపీలు కేశవరావు, నామా, మన్నె శ్రీనివాసరెడ్డి నగరానికి పయనమయ్యారు.

ఇవీ చదవండి:

Last Updated :Dec 8, 2022, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.