ETV Bharat / state

Drugs Control And Cyber Crime New Bureaus : డ్రగ్స్​, సైబర్​ నేరాల నియంత్రణకు కొత్త బ్యూరోల ఏర్పాటు

author img

By

Published : May 31, 2023, 4:07 PM IST

Updated : May 31, 2023, 6:56 PM IST

police
police

16:01 May 31

రెండు కొత్త విభాగాలు ప్రారంభిస్తున్న రాష్ట్ర హోంశాఖ

Drugs Control And Cyber Crime New Bureau In Telangana : రాష్ట్రంలో డ్రగ్స్​, సైబర్​ నేరాలు చాపకింద నీరులా విస్తరించిపోతున్నాయి. నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది. ఎందుకంటే యువత అటువైపు అడుగులు వేయకుండా ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్​ సరఫరా కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు అమలు చేస్తోంది. అందుకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు కొత్త విభాగాలను రాష్ట్ర హోం శాఖ ప్రారంభించింది.

దేశంలో మరేక్కడా లేని విధంగా నాలుగు వేల మందితో నార్కోటిక్స్​, సైబర్​ బ్యూరోలను ఏర్పాటు చేసింది. డ్రగ్స్​ నివారణకు యాంటీ నార్కోటిక్స్​ బ్యూరోను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సైబర్​ నేరాల నియంత్రణకు సైబర్​ సెక్యూరిటీ బ్యూరోను నెలకొల్పనున్నారు. ఈ రెండు విభాగాలను రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ ప్రారంభిస్తున్నారు. పోలీస్​ కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో రెండు విభాగాలు ఏర్పాటు చేశారు. టవర్​-బి లోని 13వ అంతస్తులో యాంటీ నార్కోటిక్స్​ బ్యూరోను.. టవర్​-బిలోని 2,3 అంతస్తుల్లో సైబర్​ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశారు. నార్కోటిక్​ బ్యూరో అదనపు డీజీగా సి.వి. ఆనంద్​కు అదనపు బాధ్యతలను అప్పగించారు. సైబర్​ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా స్టీఫెన్​ రవీంద్రను నియమించారు.

Cyber Crime Bureau In Telangana : రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలను పూర్తిగా నియంత్రణ చేయడానికి సమర్థవంతంగా కృషి చేస్తున్నామని హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సివి ఆనంద్​ తెలిపారు. గోవా కేంద్రంగా కరుడుగట్టిన నేరస్థులను హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన H New ద్వారా అరెస్ట్​ చేశామని చెప్పారు. ఆఫ్రికన్​ దేశానికి చెందిన కీలకమైన 12 మంది డ్రగ్స్​ ముఠా సభ్యులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో పోలీస్​ శాఖకు ధైర్యవంతులు, విజన్​తో పని చేసే పోలీస్​ సిబ్బంది అవసరమని వివరించారు.

నేరగాళ్లు డార్క్​ నైట్​ ద్వారా డ్రగ్స్​ను సరఫరా చేస్తున్నారన్నారు. నార్కోటిక్​ విభాగానికి 300 ఉద్యోగాలను ప్రభుత్వం మంజూరు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. నార్కోటిక్​ బ్యూరోలో డైరెక్టర్​ బృందం కార్యాలయం నుంచి నాలుగు ప్రధాన పోలీస్​ కమిషన్​రేట్​లు పనిచేస్తాయని సీపీ ఆనంద్​ తెలిపారు. ఈ కేసులను విచారించడానికి నాలుగు కోర్టులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్​ను అరికట్టేందుకు కేంద్ర, స్థానికంగా ఉన్న దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకొని పని చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.

Narcotics Bureau In Telangana : సైబర్​ సెక్యూరిటీ బ్యూరో వల్ల ఆన్​లైన్​ మోసాలు అనేవి ఎక్కువగా జరగకుండా చూసుకుంటూ.. ఒకవేళ మోసాలు జరిగిన త్వరితగతిన కేసును ఛేదించడానికి ఉపయోగపడతాయి. దేశాన్ని కుదిపోసిన 67 కోట్ల మంది డేటా చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. అంతేకాదు ఆ సమాచారాన్ని చోరీ చేసిన సైబర్​ నేరగాళ్లను పట్టుకునేందుకు ఎంతో శ్రమించారు. అదే సైబర్​ సెక్యూరిటీ బ్యూరోలు ఉంటే అంతర్​రాష్ట్ర దొంగలను వేగంగా పట్టుకోవచ్చు. వారి సమాచారాన్ని ఆ రాష్ట్రాలకు వేగంగా చేరవేయవచ్చు. అదే కాకుండా ఇంకా సైబర్​ నేరాలు ఎన్ని ఉన్నాయో వాటి అన్నింటికి ఈ బ్యూరో ఎంతో ఉపయోగపడుతోంది.

ఇవీ చదవండి :

Last Updated :May 31, 2023, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.