ETV Bharat / state

కుక్క కరిచిందా - ఇలా చేయకపోతే మీకు ప్రాణాపాయం తప్పదు!

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2024, 8:13 AM IST

Dog Bite Cases in Telangana
Dog Bite Victims Increases in Hyderabad

Dog Attacks in Hyderabad 2024 : భాగ్యనగరంలో కుక్కకాటు బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సాధారణంగా వేసవిలో ఎక్కువగా నమోదయ్యే కుక్కకాటు కేసులు మిగతా సీజన్లలోనూ పెరుగుతున్నాయి. ఒక్క ఫీవర్‌ ఆస్పత్రికే నెలకు సుమారు 2వేల పైచిలుకు బాధితులు వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు రేబీస్‌ మృతులు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కుక్క కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రేబీస్‌ లక్షణాలను ఎలా గుర్తించాలనే అంశాలను ఇప్పుడు చూద్దాం.

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం- కుక్కకాటుపై వైద్యుల సూచనలు

Dog Attacks in Hyderabad 2024 : సాధారణంగా ఎండాకాలంలో ఎక్కువగా కుక్కలు(Dog Bite) మనుషుల మీద దాడి చేస్తుంటాయి. హైదరాబాద్‌లో ఈసారి చలికాలంలోనూ కుక్కకాటు బాధితులు పెరుగుతున్నారు. ఒక్క ఫీవర్‌ ఆస్పత్రికే నిత్యం 80 నుంచి 100మంది వరకు చికిత్స కోసం వస్తున్నారు. గత మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో 6వేల 771 మంది బాధితులు రాగా నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో కలిపి 4 వేల 800ల మంది రావటం గమనించాల్సిన విషయం. వీటికి తోడు పిల్లి, కోతులు కరిచిన వారు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

కుక్క కాటుకు గురైన వారు వెంటనే గాయం అయిన ప్రాంతాన్ని శుభ్రంగా కడగటంతో పాటు 24 గంటల్లోపే వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకరోజు ఆలస్యమైనా నిర్లక్ష్యం చేయకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలని వైద్యులు వెల్లడిస్తున్నారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉంటే వైద్యులు యాంటీబాడీస్‌ థెరపీని సైతం ఇస్తున్నారు. ఫలితంగా రేబీస్‌ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చని ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సూచిస్తున్నారు.

Rabies Deaths in Telangana 2024 : మరోవైపు రేబీస్‌తో(Rabies) చనిపోతున్న వారి సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది ఫీవర్‌ ఆస్పత్రి పరిధిలోనే 12 మంది మృతి చెందారు. కుక్క కాటుకు గురైన వెంటనే వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఏళ్లుగా వైద్యులు చెబుతున్నా ప్రజలు పట్టించుకోకపోవడమే ఇందుకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు. ఒక్కసారి రేబీస్‌ సోకితే మాత్రం ఎలాంటి చికిత్స అందుబాటులో లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రూ.20 కోట్ల శునకం హైదరాబాద్​లో హల్​చల్​ - చూసేందుకు ఎగబడిన జనం

రేబిస్ వైరస్ ఉన్న కుక్క కాటుకు గురైన వారిలో నెల రోజుల నుంచి పదేళ్ల లోపు ఎప్పుడైన ఈ లక్షణాలు బయటపడొచ్చని వివరిస్తున్నారు. రేబిస్ సోకిన వారు నీటికి, కాంతికి బయపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు వివరిస్తున్నారు. ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవటమే మేలని సూచిస్తున్నారు. పెంపుడు కుక్కలకు సైతం వ్యాక్సినేషన్‌ చేయించటం యజమానుల బాధ్యతగా చెబుతున్నారు. కుక్క కాటుకు గురైనప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాంతక రేబీస్‌ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు

"కుక్కకాటు చాలా ప్రమాదకరం. నిర్లక్ష్యం చేసినట్లయితే ప్రాణానికే ముప్పు. కుక్క కరిస్తే 24 గంటల్లోపు వ్యాక్సిన్​ తీసుకోవాలి. ఒకవేళ ఒకరోజు ఆలస్యమైనా ప్రాణానికి ప్రమాదమే. ఒక్కసారి రేబీస్‌ సోకితే ఇక ఎవరూ కాపాడలేరు. ఎందుకంటే రేబీస్​కు ఎలాంటి చికిత్స అందుబాటులో లేదు. కుక్క కాటుకు గురైనప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాంతక రేబీస్‌ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు - డా. శంకర్‌, సూపరింటెండెంట్ ఫీవర్ ఆస్పత్రి

తోటి శునకానికి రక్తదానం- రాకీ ప్రాణాలు కాపాడిన సిరి! ఎక్కడో తెలుసా?

అసలే జ్వరం, ఆపై వీధికుక్క దాడి- ఆస్పత్రిలో తల్లీకొడుకులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.