ETV Bharat / state

Dharmapuri Arvind On Congress : 'సీతక్కను సీఎం కాదు.. పీసీసీ అధ్యక్షురాలిని చేయగలరా?'

author img

By

Published : Jul 11, 2023, 7:42 PM IST

Dharmapuri Arvind
Dharmapuri Arvind

MP Arvind Fire On Revanth Reddy And KCR : ముఖ్యమంత్రి కాదు మొదట సీతక్కను పీసీసీ చేయగలరా? అంటూ రేవంత్​ రెడ్డికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్​ విసిరారు. అవసరమైతే కాదు.. సీతక్కను సీఎం చేస్తామని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. యూసీసీ బిల్లు ఉభయ సభలో పాస్ అయ్యాక.. సీఎం కేసీఆర్ పాకిస్థాన్​ వెళ్లిపోయినా తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు.

Dharmapuri Arvind Comments On Revanth Reddy : అమెరికాలోని తానా సభలో రేవంత్​ రెడ్డి అవసరమైతే సీతక్కను సీఎం చేస్తానన్న వ్యాఖ్యలపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారమే రేగుతోంది. అప్పుడే ఎన్నికలు వచ్చాయనేంతలా.. నేతల తీరు ఉంది. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హైదరాబాద్​లో బీజేపీ సమావేశం జరిగిన అనంతరం రేవంత్​ రెడ్డి ​వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు.

సీతక్కను ముఖ్యమంత్రి కాదు.. మొదట సీతక్కను పీసీసీ అధ్యక్షురాలిని చేయగలరా? అంటూ రేవంత్​ రెడ్డి ఈ విషయానికి సమాధానం చెప్పాలని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ డిమాండ్​ చేశారు. అవసరమైతే కాదు.. సీతక్కను సీఎం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. యూసీసీ బిల్లు ఉభయ సభలో పాస్​ అయ్యాక సీఎం కేసీఆర్​ పాకిస్థాన్​ పోవాస్లిందేనని ఎద్దేవా చేశారు. ముస్లిం ఓట్లు ఎక్కడ కాంగ్రెస్​కు పడతాయనే భయం కేసీఆర్​లో మొదలైందని ఆరోపించారు.

"యూసీసీ బిల్లు ఉభయ సభల్లో పాస్​ అయ్యాక సీఎం కేసీఆర్​ పాకిస్థాన్​ పోతే ఎవరూ కాదనరు. ముస్లిం ఓట్లు కాంగ్రెస్​కు వెళతాయనే భయంతో.. ముస్లిం మత పెద్దలను పిలుచుకొని కేసీఆర్​ మీటింగ్​ పెట్టారు. యూసీసీ బిల్లుకు బీఆర్​ఎస్​ మద్దతు ఇవ్వకున్నా పాస్​ అవుతుంది. రేవంత్​ రెడ్డి సీతక్కను సీఎం చేస్తామేమో.. మొదట సీతక్కను పీసీసీ అధ్యక్షురాలిగా చేయండి. ఆ తర్వాత మాట్లాడండి. 24 గంటల విద్యుత్​పై రేవంత్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి మంచిగా సమాధానం చెప్పారు." - ధర్మపురి అర్వింద్​, నిజామాబాద్​ ఎంపీ

Dharmapuri Arvind Comments On KCR : అందుకే ముస్లిం మత పెద్దలను పిలుచుకొని.. కేసీఆర్​ మీటింగ్​ పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఉమ్మడి పౌరస్శృతి బిల్లుకు బీఆర్​ఎస్​ మద్దతు ఇవ్వకున్నా.. పాస్​ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. యూసీసీ బిల్లు పాస్​ అయ్యాక కేసీఆర్​.. పాకిస్థాన్​ పారిపోతానంటే వెళ్లిపోవచ్చని బీజేపీకి ఏం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. 24 గంటల విద్యుత్​పై రేవంత్​ రెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట రెడ్డి మంచిగా సమాధానం చెప్పారని చెప్పారు.

ధర్మపురి అర్వింద్​కు వై కేటగిరి సెక్యూరిటీ : నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​కు కేంద్ర హోం శాఖ సీఆర్ఫీఎఫ్​ బలగాలతో వై కేటగిరి భద్రతను ఏర్పాటు చేయనుంది. ఈ రెండు, మూడు రోజుల్లో వీరి భద్రత రాష్ట్రపోలీసుల చేతుల నుంచి సీఆర్ఫీఎఫ్​ బలగాల చేతుల్లోకి వెళిపోతుంది. గత కొంతకాలంగా తనపై దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని.. తనకు భద్రత కల్పించాలని అర్వింద్​ కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశారు. ఆ లేఖలకు స్పందించిన హోంశాఖ ఎనిమిది మందితో కూడిన పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేసింది.

సీతక్కను సీఎం కాదు.. పీసీసీ అధ్యక్షురాలు చేయగలరా?

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.