ETV Bharat / state

సోలార్​ విద్యుత్​తో రాష్ట్రంతా వెలుగులమయం, టీఎస్ రెడ్కోతో మరిన్ని ప్రాజెక్టులు

author img

By

Published : Aug 29, 2022, 8:43 PM IST

non conventional energy sources
non conventional energy sources

non conventional energy sources రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాంప్రదాయేతర ఇందన వనరులు వినియోగం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సాంప్రదాయేతర ఇందన వనరుల సంస్థ రెడ్కో ద్వారా 4,511 మెగావాట్ల సోలార్ విద్యుత్​ను, 128 మెగావాట్ల విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా పీపీపీ మోడల్ క్రింద మరో 1,000 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.ఇప్పటికే 4511.77 మెగావాట్ల సౌరశక్తిని సాధించింన ప్రభుత్వం మున్ముందు మరిన్ని ఉత్పత్తులు పెంచడానికి మార్గలు వెతుకుతోంది.

Solar Wind Power Increage: రోజురోజుకి పెరుగుపోతున్న జనాభాతో పాటు మనం వాడుకుంటున్న విద్యుత్​ కూడా నానాటికి పెరిగి పోతోంది. ఈ పరిస్థితుల్లో అనేక రకాలుగా విద్యుత్​ మనం తయారు చేసుకుంటున్నా, అవి అన్ని తరగిపోయే శక్తి వనరులే అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు కొత్తగా ఆలోచించి సాంప్రదాయేతర ఇందనాలుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే సోలార్ ఎనర్జీలో దేశంలో తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడంతో పాటు విద్యుత్​ను ఆదాచేసే పరికరాలు, బల్బుల వాడకాన్ని తెలంగాణ రెడ్కో ప్రోత్సహిస్తోంది.

పునరుత్పాదక ఇంధన కార్యక్రమం: తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్ పాలసీతో పాటు అన్ని పునరుత్పాదక శక్తి, ఇంధన సంరక్షణ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తోంది. పునరుత్పాదక ఇంధన కార్యక్రమం కింద, రాష్ట్రం ఇప్పటికే 4511.77 మెగావాట్ల సౌరశక్తిని సాధించింది. రాష్ట్రంలో విద్యుత్​ను ఆదాచేసే సమర్థవంతమైన ఉపకరణాల పంపిణీ, డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్ యాక్టివిటీ కింద ఎల్ఈడీ స్ట్రీట్‌లైట్లను ఏర్పాటు చేస్తోంది. విద్యుత్ సంరక్షణ కార్యకలాపాల వలన రాష్ట్రంలో 1,005 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేశారు. అన్ని గ్రామపంచాయతీలలో ఎల్ఈడీ వీధిలైట్లను అమర్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తద్వారా వార్షిక ఇంధన పొదుపులో దాదాపు 50శాతం సాధించవచ్చని అంచనా వేస్తున్నారు.

ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీ- 2020: రాష్ట్రం ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీ- 2020 ని ప్రభుత్వం రూపొందించింది. ఈ విధానంలో భాగంగా మొదటి రెండు లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, మొదటి 5,000 యూనిట్ల నాలుగు చక్రాల వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులో 100 శాతం మినహాయింపు లభిస్తుంది. రాష్ట్రంలో 32,000 ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం 156 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి.

మరో 100 ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల పనులు పురోగతిలో ఉన్నాయి. టీఎస్ రెడ్కో ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పీపీపీ మోడల్ క్రింద 1,000 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.