ETV Bharat / state

CPI Narayana on KCR: 'హుజూరాబాద్ ఉప ఎన్నిక​ ఫలితాలు కేసీఆర్​కు గుణపాఠం కావాలి'

author img

By

Published : Nov 3, 2021, 12:59 PM IST

ప్రజలు అవినీతినైనా సహిస్తారు కానీ.. అహంభావాన్ని సహించరని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana on KCR) అన్నారు. సీఎం కేసీఆర్​ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. హుజూరాబాద్​ ఉప పోరులో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్​(CPI Narayana on KCR) విజయం సాధించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

CPI Narayana on KCR
హుజూరాబాద్​ ఫలితంపై నారాయణ​ వ్యాఖ్యలు

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు సీఎం కేసీఆర్‌కు ఒక గుణపాఠం కావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana on KCR) అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా నియంతృత్వంగా వ్యవహరించడం వల్లే ఈ విధమైన ఫలితాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌.. పార్టీ లోపల, బయట నియంతృత్వ పోకడ వల్లే ఈటల రాజేందర్‌(CPI Narayana on KCR) గెలిచారు తప్పితే.. ఈ ఫలితం భాజపా సొంత బలం కాదని వ్యాఖ్యానించారు.

ప్రజలు అహంభావాన్ని సహించరు: నారాయణ

కేసీఆర్​ నియంతృత్వ పోకడ వల్లే ఈటల గెలిచారు తప్పితే.. ఇది భాజపా విజయం కాదు. హుజూరాబాద్​ ఫలితాలు కేసీఆర్​కు గుణపాఠం కావాలి. అన్ని పార్టీలు కలిసి ఐక్యంగా పోరాడితేనే తెరాస, భాజపాలను ఓడించడం సాధ్యం అవుతుంది. -నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

ప్రజలు అవినీతినైనా సహిస్తారు కానీ అహంభావాన్ని సహించరని నారాయణ(CPI Narayana on KCR) అన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్‌ గుర్తు పెట్టుకోవాలని(CPI Narayana on KCR) హెచ్చరించారు. తెరాస, భాజపాకు వ్యతిరేకంగా తెలంగాణలోని అన్ని పార్టీలు కలిసి ఐక్యంగా నిలబడితే తప్ప ఈ రెండింటినీ ఓడించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Etela Rajender Speech: 'కేసీఆర్‌ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయమిది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.