ETV Bharat / state

'సీపీఐతో పొత్తు వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది - తెలంగాణ, ఏపీలో ఒక్కో ఎంపీ స్థానంలో పోటీ'

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 18, 2023, 1:56 PM IST

Updated : Dec 18, 2023, 5:27 PM IST

CPI Leader Chada Fires on BRS Past Ruling
CPI Leader Narayan on Congress Government

CPI Leader Narayan on Congress Government : సీపీఐ ఓట్లు కాంగ్రెస్​కు కలవడం వల్లే వారు అధికారంలోకి వచ్చారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మిగతా మూడు రాష్ట్రాల్లో పొత్తు కుదుర్చుకోకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని పేర్కొన్నారు. కేసీఆర్ పుణ్యమా అని అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రేషన్​కార్డు ఇవ్వలేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

CPI Leader Narayan on Congress Government : సీపీఐ పొత్తు వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల మెజార్టీకి సీపీఐ ఓట్లు దోహదం చేశాయని తెలిపారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీనిని గుణపాఠంగా తీసుకోవాలని వ్యాఖ్యానించారు.

ఈ ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో చూస్తామని అనడం మంచిది కాదు : కూనంనేని

'వామపక్ష తీవ్ర వాదాన్ని అణచాలన్న ప్రభావం సీపీఐపై పడింది. రాజస్థాన్, ఛత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్ ఒంటెద్దు పోకడల వల్లే ఓడిపోయింది. తెలంగాణలో అందరినీ కలుపుకుపోయింది కాబట్టే కాంగ్రెస్ విజయం సాధించింది. ఇండియా కూటమి ఎంత అవసరమో, కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కలుపుకొని పోవడం కాంగ్రెస్​కు అంతే ముఖ్యం' అని నారాయణ అన్నారు.

CPI Narayana on Lok Sabha Elections : అనంతరం లోక్​సభ ఎన్నికల గురించి మాట్లాడారు. కేరళలో 4 స్థానాల్లో, తమిళనాడులో 2, బంగాల్​లో 3, బస్తర్​లోని ఎంపీ సీట్లకు పోటీ చేస్తామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ఎంపీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. బతికుండగానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధి కట్టుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాస్​బుక్​లో జగన్ ఫొటోలు ఎందుకని, తను శాశ్వత ముఖ్యమంత్రి కాదు కదా అని ప్రశ్నించారు.

CPI Leader Narayan Fires on PM Narendra Modi : పార్లమెంట్​ను కాపాడలేని ప్రధాని, హోం మంత్రి దేశాన్ని ఏం కాపాడతారనీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. పార్లమెంట్​లోకి వెళ్లాలంటే నాలుగు అంచెల భద్రత ఉంటుందని, పొగ బాంబు తీసుకెళ్తుంటే ఎందుకు స్కాన్ కాలేదన్నారు. పొగబాంబు తీసుకెళ్లిన వాళ్లకు విజిటర్స్ ​పాస్ ఇచ్చింది బీజేపీ ఎంపీనేనని ఆరోపించారు.

తెలంగాణలో కాంగ్రెస్​కు అనుకూల పవనాలు - కేసీఆర్ చేసిన ఆ పని వల్లే : సీపీఐ నారాయణ

ధరణి పేరుతో కేసీఆర్ చేసిన మోసాల కంటే, జగన్ ఎక్కువ తప్పులు చేశారని విమర్శించారు. ప్రతి ఊళ్లో జగన్ సమాధి రాయి వేసుకున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. జగన్మోహన్​ రెడ్డిపై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. బీజేపీ తెలుగు ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉందన్న ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లో మంచి నిర్ణయం తీసుకుంటే అధికార మార్పిడి ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పూరితంగా కాకుండా వర్క్ పూరితంగా మార్పులు చేసుకోవచ్చని హితవు పలికారు. పదవీ విరమణ పొందిన అధికారులకు ఏ బాధ్యతలు కట్టబెట్టకూడదని హితవు పలికారు.

కేసీఆర్ పదేళ్లు చేసిందేం లేదని అర్థమయ్యే ఓడించారు : కూనంనేని

CPI Leader Chada Fires on BRS Past Ruling : భూ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. నైజాం కాలం నుంచి భూ సమస్యలు నెలకొన్నాయన్న ఆయన కొత్త ప్రభుత్వంపై ప్రజలకు కొండంత అశలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందన్న హరీశ్ రావు, కేటీఆర్ వ్యాఖ్యలు అహంభావంగా ఉన్నాయని మండిపడ్డారు. కేసీఆర్ పుణ్యమా అని ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ రెండు అడుగులు అద్భుతంగా వేసిందని కొనియాడారు. తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రంపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు.

CPI Leader Narayan on Congress Government సీపీఐతో పొత్తు వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణ ఏపీలో ఒక్కో ఎంపీ స్థానంలో పోటీ

CPI Narayana on Governor System : 'రాష్ట్రాల పాలనలో గవర్నర్ల జోక్యం పెరిగిపోతోంది'

Last Updated :Dec 18, 2023, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.